Pak Terrorist Captured: సరిహద్దుల్లో పట్టుబడ్డ ఉగ్రవాది.. సైన్యంపై దాడి చేస్తే రూ.30 వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist captured along LoC: జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ ఉగ్రవాది పట్టుబడ్డాడు. సరిహద్దులు దాటి భారత సైన్యంపై దాడి చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా చొరబాటుదారుల కదలికలు ఎక్కువయ్యాయి. ఆగస్టు 21న నౌషేరాలోని ఝంగర్ సెక్టార్ లో నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదులను కదలికను సైన్యం గుర్తించింది. కంచెను కత్తెరించి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే సైనికులు కాల్పుల జరపడంతో ఒకరు గాయపడ్డారు. అతన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మరో ఇద్దరు సరిహద్దుల్లో అడవుల గుండా పాకిస్తాన్ లోకి పారిపోయారు.
ప్రస్తుతం గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందిస్తున్నారు. పట్టుబడిన ఉగ్రవాది పాకిస్తాన్ లోని పీఓకే లోని కోట్లీ జిల్లా సబ్ కోట్ గ్రామానికి చెందిన తబారక్ హుస్సెన్ గా గుర్తించారు. ఇండియన్ ఆర్మీ పోస్టులపై దాడుల చేసేందుకు వచ్చామని వెల్లడించాడు. కల్నల్ యూనస్ చౌదరి అనే పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కల్నల్ తనను పంపాడని.. తనకు రూ. 30,000 పాకిస్తానీ కరెన్సీ ఇచ్చి, ఇండియన్ ఆర్మీపై దాడుడు చేయాలని చెప్పాడని ఒప్పుకున్నాడు. గతంలో ఇలాగే 2016లో ఇదే సెక్టార్ లో అతని సోదరుడు హరూన్ అలీతో కలిసి తబారక్ హుస్సెన్ సరిహద్దు దాటిన సమయంలో మానవత కారణాలతో పాకిస్తాన్ తిప్పి పంపారు. ఆ తరువాత 2017లో మరోసారి ఇలాగే పట్టుబడితే మళ్లీ పాకిస్తాన్ పంపించారు.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: Zomato: జొమాటోకు షాక్.. ఆర్డర్ క్యాన్సిల్ చేసిన పాపానికి..
ఇదిలా ఉంటే ఆగస్టు 22-23న నౌషేరా జిల్లాలోని లామ్ సెక్టార్ లో ఇద్దరు, ముగ్గురు టెర్రరిస్టులు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. భారత సైన్యం వీరి కదలికలను గుర్తించింది. అయితే సరిహద్దు సమీపంలో ఉన్న ల్యాండ్ మైన్స్ పేలడంతో ఇద్దరు టెర్రరిస్టులు మరణించగా.. మరో ఉగ్రవాది గాయపడ్డాడని తెలుస్తోంది. గాయపడిన ఉగ్రవాది సమీపంలో ఎక్కడైనా దాక్కుని ఉండవచ్చని సైన్యం వెల్లడించింది. 48 గంటల్లోనే భారత్ ఆర్మీ లక్ష్యంగా చొరబాట్లు జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ సహకారంతోనే ఈ చొరబాట్లు జరుగుతున్నాయని పట్టుబడిన ఉగ్రవాది వెల్లడించాడు.
తాజావార్తలు
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!