Pak Terrorist Captured: సరిహద్దుల్లో పట్టుబడ్డ ఉగ్రవాది.. సైన్యంపై దాడి చేస్తే రూ.30 వేలు
Terrorist captured along LoC: జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ ఉగ్రవాది పట్టుబడ్డాడు. సరిహద్దులు దాటి భారత సైన్యంపై దాడి చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా చొరబాటుదారుల కదలికలు ఎక్కువయ్యాయి. ఆగస్టు 21న నౌషేరాలోని ఝంగర్ సెక్టార్ లో నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదులను కదలికను సైన్యం గుర్తించింది. కంచెను కత్తెరించి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే సైనికులు కాల్పుల జరపడంతో ఒకరు గాయపడ్డారు. అతన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మరో ఇద్దరు సరిహద్దుల్లో అడవుల గుండా పాకిస్తాన్ లోకి పారిపోయారు.
ప్రస్తుతం గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందిస్తున్నారు. పట్టుబడిన ఉగ్రవాది పాకిస్తాన్ లోని పీఓకే లోని కోట్లీ జిల్లా సబ్ కోట్ గ్రామానికి చెందిన తబారక్ హుస్సెన్ గా గుర్తించారు. ఇండియన్ ఆర్మీ పోస్టులపై దాడుల చేసేందుకు వచ్చామని వెల్లడించాడు. కల్నల్ యూనస్ చౌదరి అనే పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కల్నల్ తనను పంపాడని.. తనకు రూ. 30,000 పాకిస్తానీ కరెన్సీ ఇచ్చి, ఇండియన్ ఆర్మీపై దాడుడు చేయాలని చెప్పాడని ఒప్పుకున్నాడు. గతంలో ఇలాగే 2016లో ఇదే సెక్టార్ లో అతని సోదరుడు హరూన్ అలీతో కలిసి తబారక్ హుస్సెన్ సరిహద్దు దాటిన సమయంలో మానవత కారణాలతో పాకిస్తాన్ తిప్పి పంపారు. ఆ తరువాత 2017లో మరోసారి ఇలాగే పట్టుబడితే మళ్లీ పాకిస్తాన్ పంపించారు.
Also Read
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
Read Also: Zomato: జొమాటోకు షాక్.. ఆర్డర్ క్యాన్సిల్ చేసిన పాపానికి..
ఇదిలా ఉంటే ఆగస్టు 22-23న నౌషేరా జిల్లాలోని లామ్ సెక్టార్ లో ఇద్దరు, ముగ్గురు టెర్రరిస్టులు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. భారత సైన్యం వీరి కదలికలను గుర్తించింది. అయితే సరిహద్దు సమీపంలో ఉన్న ల్యాండ్ మైన్స్ పేలడంతో ఇద్దరు టెర్రరిస్టులు మరణించగా.. మరో ఉగ్రవాది గాయపడ్డాడని తెలుస్తోంది. గాయపడిన ఉగ్రవాది సమీపంలో ఎక్కడైనా దాక్కుని ఉండవచ్చని సైన్యం వెల్లడించింది. 48 గంటల్లోనే భారత్ ఆర్మీ లక్ష్యంగా చొరబాట్లు జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ సహకారంతోనే ఈ చొరబాట్లు జరుగుతున్నాయని పట్టుబడిన ఉగ్రవాది వెల్లడించాడు.
తాజావార్తలు
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో