Pak Terrorist Captured: సరిహద్దుల్లో పట్టుబడ్డ ఉగ్రవాది.. సైన్యంపై దాడి చేస్తే రూ.30 వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist captured along LoC: జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ ఉగ్రవాది పట్టుబడ్డాడు. సరిహద్దులు దాటి భారత సైన్యంపై దాడి చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా చొరబాటుదారుల కదలికలు ఎక్కువయ్యాయి. ఆగస్టు 21న నౌషేరాలోని ఝంగర్ సెక్టార్ లో నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదులను కదలికను సైన్యం గుర్తించింది. కంచెను కత్తెరించి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే సైనికులు కాల్పుల జరపడంతో ఒకరు గాయపడ్డారు. అతన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మరో ఇద్దరు సరిహద్దుల్లో అడవుల గుండా పాకిస్తాన్ లోకి పారిపోయారు.
ప్రస్తుతం గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందిస్తున్నారు. పట్టుబడిన ఉగ్రవాది పాకిస్తాన్ లోని పీఓకే లోని కోట్లీ జిల్లా సబ్ కోట్ గ్రామానికి చెందిన తబారక్ హుస్సెన్ గా గుర్తించారు. ఇండియన్ ఆర్మీ పోస్టులపై దాడుల చేసేందుకు వచ్చామని వెల్లడించాడు. కల్నల్ యూనస్ చౌదరి అనే పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కల్నల్ తనను పంపాడని.. తనకు రూ. 30,000 పాకిస్తానీ కరెన్సీ ఇచ్చి, ఇండియన్ ఆర్మీపై దాడుడు చేయాలని చెప్పాడని ఒప్పుకున్నాడు. గతంలో ఇలాగే 2016లో ఇదే సెక్టార్ లో అతని సోదరుడు హరూన్ అలీతో కలిసి తబారక్ హుస్సెన్ సరిహద్దు దాటిన సమయంలో మానవత కారణాలతో పాకిస్తాన్ తిప్పి పంపారు. ఆ తరువాత 2017లో మరోసారి ఇలాగే పట్టుబడితే మళ్లీ పాకిస్తాన్ పంపించారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Zomato: జొమాటోకు షాక్.. ఆర్డర్ క్యాన్సిల్ చేసిన పాపానికి..
ఇదిలా ఉంటే ఆగస్టు 22-23న నౌషేరా జిల్లాలోని లామ్ సెక్టార్ లో ఇద్దరు, ముగ్గురు టెర్రరిస్టులు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. భారత సైన్యం వీరి కదలికలను గుర్తించింది. అయితే సరిహద్దు సమీపంలో ఉన్న ల్యాండ్ మైన్స్ పేలడంతో ఇద్దరు టెర్రరిస్టులు మరణించగా.. మరో ఉగ్రవాది గాయపడ్డాడని తెలుస్తోంది. గాయపడిన ఉగ్రవాది సమీపంలో ఎక్కడైనా దాక్కుని ఉండవచ్చని సైన్యం వెల్లడించింది. 48 గంటల్లోనే భారత్ ఆర్మీ లక్ష్యంగా చొరబాట్లు జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ సహకారంతోనే ఈ చొరబాట్లు జరుగుతున్నాయని పట్టుబడిన ఉగ్రవాది వెల్లడించాడు.
తాజావార్తలు
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
-
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!