Ghulam Nabi Azad: రెండు వారాల్లో గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల్లోనే కొత్త పార్టీ స్థాపిస్తారని.. గులాం నబీ ఆజాద్కు అత్యంత సన్నిహితుడైన జీఎం సరూరీ వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో 2019 ఆగస్టు 5వ తేదీకి ముందున్న స్థితిని పునరుద్ధరించాలనే అంశాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. గులాం నబీ ఆజాద్ సెప్టెంబర్ 4న జమ్మూ కశ్మీర్కు వచ్చి సన్నిహితులతకో సమావేశమవుతారని ఆయన వెల్లడించారు. ఆ తర్వాతే కొత్త పార్టీని ప్రకటిస్తారని చెప్పారు. అభివృద్ధి, సమాజంలోని అన్ని వర్గాల ఐక్యత కోసం పార్టీ పనిచేస్తుందని సరూరీ స్పష్టం చేశారు. ఆజాద్ బీజేపీ చేరతారన్న వార్తలను సరూరీ కొట్టి పారేశారు. తమ నాయకుడు సిద్ధాంతాలపరంగా లౌకికవాది అని.. ఆయన బీజేపీ పక్కన చేరే అవకాశమే లేదని చెప్పారు. ముందుగా రాష్ట్ర స్థాయిలో పార్టీని ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత జాతీయ పార్టీ విషయాన్ని పరిశీలిస్తామని సరూరీ పేర్కొన్నారు.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఆయనకు మద్దతుగా సరూరీ కూడా రాజీనామా చేశారు. ఆయనతోపాటు జమ్మూకశ్మీర్కు చెందిన చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. వీళ్లేగాక వందల సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సరూరీ ఆజాద్తో ఢిల్లీలో సమావేశమయ్యారు. సరూరీతో పాటు మరికొందరు నేతలు ఆజాద్ను కలిసి రాజకీయ వ్యూహంపై చర్చించారు. ఐదు దశాబ్ధాలుగా కాంగ్రెస్లో కొనసాగిన ఆజాద్ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు.
Also Read
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
Delhi: 47 ఫైళ్లను తిరిగి సీఎంవోకు పంపిన లెఫ్టినెంట్ గవర్నర్.. ఎందుకంటే?
మరోవైపు ఇవాళ గులాం నబీ ఆజాద్ను హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆనంద్ శర్మ ఢిల్లీలో కలిశారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మల మధ్య దాదాపు గంటకుపైగా భేటీ జరిగింది. ఆగస్టు 26న కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన జమ్మూకశ్మీర్ మాజీ మంత్రి ఆర్ఎస్ చిబ్ కూడా హాజరయ్యారు.
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!