Ghulam Nabi Azad: రెండు వారాల్లో గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల్లోనే కొత్త పార్టీ స్థాపిస్తారని.. గులాం నబీ ఆజాద్కు అత్యంత సన్నిహితుడైన జీఎం సరూరీ వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో 2019 ఆగస్టు 5వ తేదీకి ముందున్న స్థితిని పునరుద్ధరించాలనే అంశాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. గులాం నబీ ఆజాద్ సెప్టెంబర్ 4న జమ్మూ కశ్మీర్కు వచ్చి సన్నిహితులతకో సమావేశమవుతారని ఆయన వెల్లడించారు. ఆ తర్వాతే కొత్త పార్టీని ప్రకటిస్తారని చెప్పారు. అభివృద్ధి, సమాజంలోని అన్ని వర్గాల ఐక్యత కోసం పార్టీ పనిచేస్తుందని సరూరీ స్పష్టం చేశారు. ఆజాద్ బీజేపీ చేరతారన్న వార్తలను సరూరీ కొట్టి పారేశారు. తమ నాయకుడు సిద్ధాంతాలపరంగా లౌకికవాది అని.. ఆయన బీజేపీ పక్కన చేరే అవకాశమే లేదని చెప్పారు. ముందుగా రాష్ట్ర స్థాయిలో పార్టీని ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత జాతీయ పార్టీ విషయాన్ని పరిశీలిస్తామని సరూరీ పేర్కొన్నారు.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఆయనకు మద్దతుగా సరూరీ కూడా రాజీనామా చేశారు. ఆయనతోపాటు జమ్మూకశ్మీర్కు చెందిన చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. వీళ్లేగాక వందల సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సరూరీ ఆజాద్తో ఢిల్లీలో సమావేశమయ్యారు. సరూరీతో పాటు మరికొందరు నేతలు ఆజాద్ను కలిసి రాజకీయ వ్యూహంపై చర్చించారు. ఐదు దశాబ్ధాలుగా కాంగ్రెస్లో కొనసాగిన ఆజాద్ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు.
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
Delhi: 47 ఫైళ్లను తిరిగి సీఎంవోకు పంపిన లెఫ్టినెంట్ గవర్నర్.. ఎందుకంటే?
మరోవైపు ఇవాళ గులాం నబీ ఆజాద్ను హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆనంద్ శర్మ ఢిల్లీలో కలిశారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మల మధ్య దాదాపు గంటకుపైగా భేటీ జరిగింది. ఆగస్టు 26న కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన జమ్మూకశ్మీర్ మాజీ మంత్రి ఆర్ఎస్ చిబ్ కూడా హాజరయ్యారు.
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!