Ghulam Nabi Azad: రెండు వారాల్లో గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల్లోనే కొత్త పార్టీ స్థాపిస్తారని.. గులాం నబీ ఆజాద్కు అత్యంత సన్నిహితుడైన జీఎం సరూరీ వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో 2019 ఆగస్టు 5వ తేదీకి ముందున్న స్థితిని పునరుద్ధరించాలనే అంశాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. గులాం నబీ ఆజాద్ సెప్టెంబర్ 4న జమ్మూ కశ్మీర్కు వచ్చి సన్నిహితులతకో సమావేశమవుతారని ఆయన వెల్లడించారు. ఆ తర్వాతే కొత్త పార్టీని ప్రకటిస్తారని చెప్పారు. అభివృద్ధి, సమాజంలోని అన్ని వర్గాల ఐక్యత కోసం పార్టీ పనిచేస్తుందని సరూరీ స్పష్టం చేశారు. ఆజాద్ బీజేపీ చేరతారన్న వార్తలను సరూరీ కొట్టి పారేశారు. తమ నాయకుడు సిద్ధాంతాలపరంగా లౌకికవాది అని.. ఆయన బీజేపీ పక్కన చేరే అవకాశమే లేదని చెప్పారు. ముందుగా రాష్ట్ర స్థాయిలో పార్టీని ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత జాతీయ పార్టీ విషయాన్ని పరిశీలిస్తామని సరూరీ పేర్కొన్నారు.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఆయనకు మద్దతుగా సరూరీ కూడా రాజీనామా చేశారు. ఆయనతోపాటు జమ్మూకశ్మీర్కు చెందిన చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. వీళ్లేగాక వందల సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సరూరీ ఆజాద్తో ఢిల్లీలో సమావేశమయ్యారు. సరూరీతో పాటు మరికొందరు నేతలు ఆజాద్ను కలిసి రాజకీయ వ్యూహంపై చర్చించారు. ఐదు దశాబ్ధాలుగా కాంగ్రెస్లో కొనసాగిన ఆజాద్ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు.
Also Read
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
Delhi: 47 ఫైళ్లను తిరిగి సీఎంవోకు పంపిన లెఫ్టినెంట్ గవర్నర్.. ఎందుకంటే?
మరోవైపు ఇవాళ గులాం నబీ ఆజాద్ను హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆనంద్ శర్మ ఢిల్లీలో కలిశారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మల మధ్య దాదాపు గంటకుపైగా భేటీ జరిగింది. ఆగస్టు 26న కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన జమ్మూకశ్మీర్ మాజీ మంత్రి ఆర్ఎస్ చిబ్ కూడా హాజరయ్యారు.
తాజావార్తలు
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!