Jammu Kashmir: జమ్మూకశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. ఈ రెండు కేసులను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. జమ్మూకశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అందిన సమాచారం ప్రకారం పోలీసులు, ఆర్మీ పెట్రోలింగ్ బృందం జమ్మూలోని ఘరోటా ప్రాంతంలో రోడ్డు పక్కన అనుమానాస్పద వస్తువును కనుగొన్నారు. అయితే దానిని పరిశీలించగా అది పేలుడు పదార్థంగా అనుమానించారు. ఈ…
Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాద నేత, పలు ఉగ్రవాద ఘటనలో సంబంధం ఉన్న యాసిన్ మాలిక్ తాను 1994 నుంచి హింసను విడిచిపెట్టినట్లు పేర్కొన్నాడు. ఐక్య, స్వతంత్ర కాశ్మీర్ కోసం తాను గాంధేయ మార్గాన్ని అనుసరిస్తున్నానని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ చెప్తుంది.. కానీ, పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని వెనక్కి తీసుకొస్తామని ఎప్పుడైనా చెప్పిందా అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. పాకిస్థాన్కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్.. హర్యానా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించగలదా..? అని ఆయన ప్రశ్నించారు.
Rajnath Singh: పాకిస్తాన్ని ఉద్దేశించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్తో స్నేహంగా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి ఆ దేశం పొందిన దాని కన్నా అతిపెద్ద బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే వాళ్లం అని ఆదివారం అన్నారు. బందిపొరా జిల్లాలోని గురేజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతున్న ఆపరేషన్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం క్షీణించింది. కథువాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన వచ్చారు.
Amit Shah: జమ్మూ కాశ్మీర్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదులతో శాంతికి సిద్ధమే అని ప్రకటించారు. ఆయుధాలు వదులుకుని, ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని లేదా భద్రతా బలగాల చేతిలో చావడానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా గురువారం కోరారు.
జమ్మూ కాశ్మీర్లో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు సాయంత్రం 5 గంటల వరకు 54 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.