Jammu Kashmir: అధికారం కోసం వైరి పక్షాలు ఏకమవుతాయా..? కాశ్మీర్ నేతలు ఏం చెబుతున్నారు..
- జమ్మూ కాశ్మీర్లో హంగ్ అసెంబ్లీ.. ఎగ్జిట్ పోల్స్ అంచనా..
- ఫరూఖ్ అబ్దుల్లా పార్టీకి.. మొహబూబా ముఫ్తీ పార్టీ మద్దతు ఇస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కొత్త పొత్తులకు దారి తీస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఏ పార్టీకి కూడా మెజారిటీ ఫిగర్ రాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జమ్మూలో బీజేపీకి గణనీయమైన సీట్లు వస్తాయని, కాశ్మీర్లోయలో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తాయని చెప్పాయి. మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని సర్వేలు అంచనా వేశాయి.
ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో వైరి పక్షాలు చేతులు కలిపేలా కనిపిస్తోంది. ప్రత్యర్థులుగా ఉన్న ఎన్సీ, పీడీపీలు అధికారం కోసం జతకట్టే అవకాశం ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆదివారం మాట్లాడుతూ.. అవసరమైతే ముఫ్తీకి చెందిన పీడీపీ మద్దతుతో జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. పీడీపీ నుంచి మద్దతు తీసుకుంటారా..? అని అడిగిన నేపథ్యంలో ఆయన ఈ సమాధానం చెప్పారు.
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
Read Also: Hezbollah: ఆ బాధ్యతలు తీసుకుంటే ఇజ్రాయిల్ చేతిలో చావే.. హిజ్బుల్లా చీఫ్ పదవిని చేపట్టేందుకు భయం..
‘‘మనమందరం ఒకే లక్ష్యం కోసం పనిచేస్తే, రాష్ట్ర ప్రజల స్థితిగతులను మెరుగుపరచడం, నిరుద్యోగం తొలగించడం, గత 10 సంవత్సరాలలో సంభవించిన అన్ని కష్టాలను తొలగించడం చేయవచ్చు. మనం చేయవలసిన మొదటి పని పునరుద్ధరించడం పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించడం. ఎన్నికల్లో ఏది నిజం, ఏది నిజం కాదో చెప్పే హక్కు ఉండాలి, మేము ఎన్నికల్లో ప్రత్యర్థులం.. కానీ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కాంగ్రెస్కి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు’’ అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.
ఇదిలా ఉంటే, ఫరూఖ్ కుమారుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ముఫ్తీ పార్టీ మద్దతు వార్తల్ని ఊహాగానాలుగా కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా తర్వాత పీడీపీ ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తుందనే వార్తలు వచ్చాయి. పీడీపీ నాయకురాలు మొహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ కూడా అనవసర ఊహాగానాలుగా ఈ వార్తల్ని కొట్టిపారేశారు. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ ప్రాంతానికి ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. రేపటితో జమ్మూ కాశ్మీర్లో గెలిచేది ఎవరో తెలుస్తుంది.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!