Rajnath Singh: భారత్తో పాక్ స్నేహంగా ఉంటే.. ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్లం..
- భారత్తో స్నేహంగా ఉంటే పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చేవాళ్లం..
- ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ బెయిలవుట్ ప్యాకేజీ అందించే వాళ్లం..
- రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: పాకిస్తాన్ని ఉద్దేశించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్తో స్నేహంగా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి ఆ దేశం పొందిన దాని కన్నా అతిపెద్ద బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే వాళ్లం అని ఆదివారం అన్నారు. బందిపొరా జిల్లాలోని గురేజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
2014-15లో ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. 2014-15లో ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్కి రూ. 90,000 కోట్లు ఇచ్చింది. ప్రస్తుతం ఐఎంఎఫ్ పాకిస్తాన్కి ప్రకటించిన బెయిల్ అవుట్ ప్యాకేజీ కన్నా ఎక్కువ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన ‘‘ మేము స్నేహితుల్ని మార్చగలం కానీ పొరుగువారిని మార్చలేము’’ వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Electric Scooter: మార్కెట్లోకి మరో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంటే, పాకిస్తాన్ మాత్రం తన నిధుల్ని దుర్వినయోగం చేస్తుందని రాజ్నాథ్ విమర్శించారు. పాక్ తన గడ్డని ఉగ్రవాద కర్మాగారంగా మార్చిందని, దానిని నడపడానికి ఇతర దేశాల నుంచి డబ్బు కోరుతోందని అన్నారు. భారత్కి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని సాధానంగా ఉపయోగిస్తుందని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ విశ్వనీయతపై దాని మిత్రదేశాలకు కూడా సందేహాలు ఏర్పడ్డాయని, ఒంటరిగా మారిందని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్ర నిరాశకు లోనైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుందని, అయినా కూడా ఫలితం లేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం పాకిస్తాన్కి ఇష్టం లేదని, ఒకవేళ ఆ దేశం భారత్పై దాడులు చేస్తే, సమాధానం చెబుతామని అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!