Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. వరసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కిష్ట్వార్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయి.
Sushilkumar Shinde: మాజీ కేంద్ర హోం మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ హాయాంలో 2012లో షిండే కేంద్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో తన శ్రీనగర్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. మంగళవారం, ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని లాల్ చౌక్ని సందర్శించినప్పుడు తానను భయపడ్డానని వెల్లడించారు.
Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ప్రజలు భారత్లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ ఠాకూర్కి మద్దతుగా రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో రాజ్నాథ్ ప్రసంగించారు. పీఓకే ప్రజలు భారత్లో వచ్చి చేరాలని, వారిని విదేశీయుల్లా చూసే పాకిస్తాన్లా కాకుండా సొంతవారిలా ఆదరిస్తామని చెప్పారు.
Afzal Guru: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. 2001లో పార్లమెంట్పై దాడి చేసిన కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల ఏం ప్రయోజనం లేదని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది.
Omar Abdullah: నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘IC814: కాందహార్ హైజాక్’ సంచలనంగా మారింది. ఇందులో ఉగ్రవాదులను హిందూ పేర్లతో పిలవడంపై రచ్చ మొదలైంది. అయితే, కేంద్రం వార్నింగ్తో మరోసారి ఇలాంటి ఘటన జరగదని నెట్ఫ్లిక్స్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే, ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా కూడా వేడిని పెంచుతోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది
Amit Shah: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. రాహల్ గాంధీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి వేర్పాటువాదులను, ఉగ్రవాద సానుభూతిపరులను విడుదల చేయాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. ఎన్సీ, కాంగ్రెస్…
Article 370: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోని విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆయన తోసిపుచ్చారు.
S Jaishankar: జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ రాజీ పడే పరిస్థితే లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లో సానుకూల, ప్రతికూల పరిస్థితుల్లో భారత్ స్పందిస్తుందని అన్నారు. దాయాది దేశంతో ‘‘అంతరాయం లేని చర్చల’’ యుగం ముగిసిందని చెప్పారు.
Pakistan: పాకిస్తాన్ తన సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు కాశ్మీర్ని సాధనంగా వాడుకుంటోంది. అ దేశంలో ప్రజలు తినడానికి తిండి లేకున్నా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కాశ్మీర్ తమ ప్రాధాన్యత ఎజెండాగా ఉంచుతోంది.
Encounter : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు బుధవారం భారీ చర్యలు చేపట్టాయి. కుప్వారా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో కనీసం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.