PM Modi: పాకిస్థాన్కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్..
- దేశం కోసం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకించింది..
- పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని వెనక్కి తీసుకొస్తామని ఎప్పుడైనా కాంగ్రెస్ చెప్పిందా..
- పాకిస్థాన్కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్.. ప్రజల గురించి ఆలోచిస్తుందా: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీ అన్ని తప్పుడు వాగ్దానాలే చేస్తుందని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల్వాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని విపక్ష పార్టీపై నిప్పులు చెరిగారు. దేశం కోసం ఎన్డీయే సర్కార్ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ హస్తం పార్టీ వ్యతిరేకించిందన్నారు. అయోధ్య నిర్మాణంలోనూ అడ్డు చెప్పుకొచ్చింది.. జమ్మూకశ్మీర్లో పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేయాడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. అలాగే, పార్లమెంట్, విధాన సభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును నిరాకరించింది అని నరేంద్ర మోడీ మండిపడ్డారు.
Read Also: UP: యూపీలో ఘోరం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ఇక, దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైంది అని ప్రధాని మోడీ అన్నారు. కానీ, తమ కుటుంబాన్ని మరింత బలోపేతం చేసేందుకే శ్రమించిందని కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లోని దేశభక్తిని నాశనం చేసేందుకు హస్తం పార్టీ ట్రై చేస్తోంది.. ప్రజల్లో యూనిటీ ఎంత బలంగా ఉంటే.. కాంగ్రెస్ గెలుపు కూడా అంతే కష్టంగా మారుతుందని భావిస్తోంది. అందుకే దేశభక్తుల ఐక్యతను నాశనం చేసేందుకే ఆ పార్టీ యత్నిస్తోంది ఆయన పేర్కొన్నారు. హర్యానాలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంది.. ప్రజలు తమకు అధికారం అప్పగిస్తారని కాంగ్రెస్ అనుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
Read Also: US-Israel: ఇజ్రాయెల్కు అమెరికా అలర్ట్.. ఇరాన్ క్షిపణి దాడి చేయొచ్చని హెచ్చరిక
కాగా, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ చెప్తుంది.. కానీ, పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని వెనక్కి తీసుకొస్తామని ఎప్పుడైనా చెప్పిందా అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. పాకిస్థాన్కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్.. హర్యానా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించగలదా..? అని ఆయన ప్రశ్నించారు. ఇక, హర్యానాలో అక్టోబరు 5న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికలకు కొద్ది సమయమే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
తాజావార్తలు
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!