Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు..ఆరుగురు జవాన్లకు గాయాలు..
- భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు..
- ఎల్ఓసీ వద్ద ప్రమాదవశాత్తు పేలుడు..
- ఆరుగురు జవాన్లకు స్వల్ప గాయాలు..
- రాజౌరీ జిల్లా నౌషేరా భవానీ సెక్టార్లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద ల్యాండ్ మైన్ పేలింది. భారత్-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సాధారణ గస్తీలో భాగంగా జవాన్లు ఆ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో అనుకోకుండా మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Adam Gilchrist: ‘బ్యాటింగ్పై దృష్టి పెట్టు.. జుట్టు మీద కాదు’.. భారత్ బ్యాటర్ పై కీలక వ్యాఖ్యలు
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
సైనిక వర్గాల ప్రకారం.. సైనికులు సున్నితమైన ప్రాంతాల్లో తమ గస్తీని నిర్వహిస్తుండగా, అందులో ఒకరు పొరపాటున మందుపాతరపై కాలు వేయడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఆరుగురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి వెంటనే వైద్య సహాయం అందించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారి పరిస్థితి బాగానే ఉందని, తదుపరి వైద్య కోసం సైనికులను సమీపంలోని వైద్య కేంద్రానికి తరలించారు.
గతంలో అనేక ఘర్షణలకు ఈ నౌషేరా సెక్టార్ కేంద్రంగా ఉంది. ఉగ్రవాదులు సరిహద్దు కంచెను దాటి రావడం, పాకిస్తాన్ బలగాల కాల్పులు కారణంగా ఎల్ఓసీ సమీపంలోని ఈ ప్రాంతం హై-సెక్యూరిటీ జోన్గా ఉంది. సరిహద్దు భద్రతా చర్యల్లో భాగంగా మందుపాతరలను అమర్చుతారు. అనుకోకుండా గస్తీ సమయంలో వీటిపై కాలు వేయడంతో తాజా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి, ఈ ప్రాంతంలో సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి సైన్యం దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రాంతంలో భద్రతను పెంచడంతో పాటు అదనపు ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!