Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు..ఆరుగురు జవాన్లకు గాయాలు..
- భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు..
- ఎల్ఓసీ వద్ద ప్రమాదవశాత్తు పేలుడు..
- ఆరుగురు జవాన్లకు స్వల్ప గాయాలు..
- రాజౌరీ జిల్లా నౌషేరా భవానీ సెక్టార్లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద ల్యాండ్ మైన్ పేలింది. భారత్-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సాధారణ గస్తీలో భాగంగా జవాన్లు ఆ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో అనుకోకుండా మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Adam Gilchrist: ‘బ్యాటింగ్పై దృష్టి పెట్టు.. జుట్టు మీద కాదు’.. భారత్ బ్యాటర్ పై కీలక వ్యాఖ్యలు
Also Read
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
సైనిక వర్గాల ప్రకారం.. సైనికులు సున్నితమైన ప్రాంతాల్లో తమ గస్తీని నిర్వహిస్తుండగా, అందులో ఒకరు పొరపాటున మందుపాతరపై కాలు వేయడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఆరుగురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి వెంటనే వైద్య సహాయం అందించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారి పరిస్థితి బాగానే ఉందని, తదుపరి వైద్య కోసం సైనికులను సమీపంలోని వైద్య కేంద్రానికి తరలించారు.
గతంలో అనేక ఘర్షణలకు ఈ నౌషేరా సెక్టార్ కేంద్రంగా ఉంది. ఉగ్రవాదులు సరిహద్దు కంచెను దాటి రావడం, పాకిస్తాన్ బలగాల కాల్పులు కారణంగా ఎల్ఓసీ సమీపంలోని ఈ ప్రాంతం హై-సెక్యూరిటీ జోన్గా ఉంది. సరిహద్దు భద్రతా చర్యల్లో భాగంగా మందుపాతరలను అమర్చుతారు. అనుకోకుండా గస్తీ సమయంలో వీటిపై కాలు వేయడంతో తాజా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి, ఈ ప్రాంతంలో సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి సైన్యం దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రాంతంలో భద్రతను పెంచడంతో పాటు అదనపు ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!