Amit Shah: కాశ్మీర్కి ‘‘ఋషి కశ్యప’’ పేరు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- కాశ్మీర్కి ఋషి కశ్యపుడి పేరు పెట్టవచ్చు..
- సంచలన ప్రకటన చేసిన కేంద్రమంత్రి అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కాశ్మీర్కి హిందూమతంలో గౌరవనీయులైన ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అన్నారు. ఢిల్లీలో ‘‘జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్’’ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాశ్మీరు కశ్యపుడి భూమి అని మనందరకి తెలుసు, కాశ్మీర్కు ఋషి కశ్యపుడి పేరు పెట్టే అవకాశం ఉంది అని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిందని, సరైన విషయాలను ప్రజలకు అందించాలని అన్నారు. “భారతదేశ అభివృద్ధికి జమ్మూ కాశ్మీర్ గణనీయంగా దోహదపడింది. మేము కాశ్మీర్ యొక్క సాంస్కృతిక వైభవాన్ని సాధిస్తాము,” అని చెప్పారు.
Read Also: Adani bribery case: అదానీకి అమెరికా షాక్.. సంయుక్త విచారణకు ఆదేశం..
Also Read
- EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
భౌగోళిక, రాజకీయ సరిహద్దులు కాకుండా సాంస్కృతిక సరిహద్దులు ఉన్న ఏకైక దేశం భారతదేశమే అని అమిత్ షా అన్నారు. కాశ్మీర్లో శంకరాచార్య, సిల్క్ రూట్, హేమిష్ మఠం భారతీయ సంస్కృతితో ముడిపడి ఉందని చెప్పారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, అలాగే ఉంటుందని షా పునరుద్ఘాటించారు. లడఖ్లోని దేవాలయాలను ధ్వంసం చేయడం, కాశ్మీర్లో సంస్కృతం ఉపయోగించడం భారతీయ నాగరికతతో ఈ ప్రాంతానికి ఉన్న లోతైన సంబంధానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం జరిగిన పొరపాట్లను కూడా ఈ పుస్తకం ప్రస్తావించిందని చెప్పారు.
కాశ్మీర్లో ప్రత్యేక హక్కులను కల్పించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏని అమిత్ షా విమర్శించారు. ఈ నిబంధనలు దేశం ఐక్యంగా ఉండకుండా నిరోధించాయని చెప్పారు. ఈ నిబంధనలను నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తొలగించి, కాశ్మీర్ అభివృద్ధికి మార్గం సుగమం చేసిందని అన్నారు. ఆర్టికల్ 370 కశ్మీరీలలో వేర్పాటువాద బీజాన్ని నాటిందని, వీటి తొలగింపు తర్వాత లోయలో ఉగ్రవాదం తగ్గిందని అమిత్ షా చెప్పారు. కేంద్రం ప్రభుత్వం 2019 ఆగస్టులో ఈ రెండు ప్రత్యేక ఆర్టికల్స్ని తొలగించింది.
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!