Rajnath Singh: పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ సంపూర్ణం కాదు.. రాజ్నాథ్ సంచలన వ్యాఖ్యలు..
- పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణం..
- రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: పాకిస్తాన్ ఆక్రమి కాశ్మీర్(పీఓకే)పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని అన్నారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడానికి సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన కృషిని రాజ్నాథ్ సింగ్ మంగళవారం ప్రశంసించారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ, కాశ్మీర్లను సమానం చూస్తుందని చెప్పారు. అఖ్నూర్ సెక్టార్లోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్లో 9వ సాయుధ దళాల మాజీ సైనికులు దినోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
‘‘గత ప్రభుత్వాలు కాశ్మీర్ని భిన్నంగా చూశాయి. ఫలితంగా ఈ ప్రాంతంలోని మన సోదరులు, సోదరీమణులను దేశంతో కలపలేకపోయారు. మా ప్రభుత్వం కాశ్మీర్ ,దేశంలోని మిగత ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది’’ అని అన్నారు. ఈ దిశగా సరైన చర్యలు తీసుకున్న సీఎం ఒమర్ అబ్దుల్లా అని ప్రశంసించారు.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: Meta: “మెటా”కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. జుకర్బర్గ్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ప్రధాని చౌదరి అన్వరుల్ దేశానికి భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ సంపూర్ణం కాదని చెప్పారు. మాజీ సైనికులకు మకర సంక్రాంతి, న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిర్వహించొద్దని పాకిస్తాన్ని హెచ్చరించారు. వాటిని నాశనం చేయాల్సి ఉంటుందని చెప్పారు. పీఓకే పాకిస్తాన్కి విదేశీ భూభాగం తప్పితే మరేమీ కాదని ఆయన అన్నారు.
1965లోనే అప్పటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసి ఉండేదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. “1965లో అఖ్నూర్లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సైన్యం ప్రయత్నాలను అడ్డుకోవడంలో భారతదేశం విజయం సాధించింది. .పాకిస్తాన్ 1965 నుండి అక్రమ చొరబాట్లను,ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది, ” అని అన్నారు. నిజానికి 1965లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్డుకోవాల్సింది, యుద్ధం నుంచి లభించిన వ్యూహాత్మక ప్రయోజనాన్ని వాడుకోలేకపోయిందని అన్నారు.
తాజావార్తలు
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!