Rajnath Singh: పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ సంపూర్ణం కాదు.. రాజ్నాథ్ సంచలన వ్యాఖ్యలు..
- పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణం..
- రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: పాకిస్తాన్ ఆక్రమి కాశ్మీర్(పీఓకే)పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని అన్నారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడానికి సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన కృషిని రాజ్నాథ్ సింగ్ మంగళవారం ప్రశంసించారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ, కాశ్మీర్లను సమానం చూస్తుందని చెప్పారు. అఖ్నూర్ సెక్టార్లోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్లో 9వ సాయుధ దళాల మాజీ సైనికులు దినోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
‘‘గత ప్రభుత్వాలు కాశ్మీర్ని భిన్నంగా చూశాయి. ఫలితంగా ఈ ప్రాంతంలోని మన సోదరులు, సోదరీమణులను దేశంతో కలపలేకపోయారు. మా ప్రభుత్వం కాశ్మీర్ ,దేశంలోని మిగత ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది’’ అని అన్నారు. ఈ దిశగా సరైన చర్యలు తీసుకున్న సీఎం ఒమర్ అబ్దుల్లా అని ప్రశంసించారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
Read Also: Meta: “మెటా”కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. జుకర్బర్గ్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ప్రధాని చౌదరి అన్వరుల్ దేశానికి భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ సంపూర్ణం కాదని చెప్పారు. మాజీ సైనికులకు మకర సంక్రాంతి, న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిర్వహించొద్దని పాకిస్తాన్ని హెచ్చరించారు. వాటిని నాశనం చేయాల్సి ఉంటుందని చెప్పారు. పీఓకే పాకిస్తాన్కి విదేశీ భూభాగం తప్పితే మరేమీ కాదని ఆయన అన్నారు.
1965లోనే అప్పటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసి ఉండేదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. “1965లో అఖ్నూర్లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సైన్యం ప్రయత్నాలను అడ్డుకోవడంలో భారతదేశం విజయం సాధించింది. .పాకిస్తాన్ 1965 నుండి అక్రమ చొరబాట్లను,ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది, ” అని అన్నారు. నిజానికి 1965లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్డుకోవాల్సింది, యుద్ధం నుంచి లభించిన వ్యూహాత్మక ప్రయోజనాన్ని వాడుకోలేకపోయిందని అన్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!