Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, అనధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుదనే వార్తలు వినిపిస్తున్నాయి.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించింది.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ అనంత్నాగ్ జిల్లా పహల్గామ్లో ఉగ్రవాదులు టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం ఉదయం పర్యాటకులు బైసారన్ గడ్డి మైదానాలను చూసేందుకు వచ్చారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహెల్గావ్లో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ఒకరు మరణించినట్లు సమాచారం. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఉగ్రదాడి ఘటన జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకుని, కూంబింగ్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ, యూఎస్ అధికారులతో పాక్ అధికారులు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. బలూచిస్తాన్లో బీఎల్ఏ ట్రైన్ హైజాక్ ఘటన, ఇతర దాడుల తర్వాత వీరంతా సౌదీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో పాకిస్తాన్ని సౌదీ అరేబియా,…
Encounter: జమ్మూ కాశ్మీర్ కథువాలో ఉగ్రవాదుల చొరబాటును భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. హిరానగర్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో, భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు! ఈ ప్రాంతంలో ఇద్దరు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు…
Amit Shah: కేంద్రం హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రిత్వ శాఖ పనితీరుపై జరిగిన చర్చలో సమాధానమిస్తూ.. ‘‘ఈ దేశంలో మార్చి 31, 2026 నాటికి నక్సలిజం నిర్మూలించబడుతుందని చెబుతున్నా’’ అని అన్నారు. ఇటీవల, వరసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు.
బాలీవుడ్ సోషలైట్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి చిక్కుల్లో చిక్కుకున్నాడు. జమ్మూ కాశ్మీర్లోని కాట్రాలో వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ప్రాంతాన్ని పవిత్ర ప్రాంతంగా భక్తులు భావిస్తారు. అలాంటి స్థలంలో ఓర్రీ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. దీంతో ఓర్రీ సహా చట్టాన్ని ఉల్లంఘించిన ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Pulwama Attack: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ‘‘పుల్వామ ఉగ్రదాడి’’కి ఆరేళ్లు గడిచాయి. 2019, ఫిబ్రవరి 14న పేలుడు పదార్థాలతో నిండిన కారు, సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుని ఢీకొట్టింది. ఈ దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడింది.