జమ్మూ కాశ్మీర్లో మరో కుట్ర చేసేందుకు పాక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉగ్రవాదులను ఇండియాలోకి చొరబడేందుకు పరోక్షంగా పాక్ సహకరిస్తూనే డ్రోన్ల ద్వారా ఆయుధాలను దేశ సరిహద్దుల్లో జారవిడుస్తోంది. ఇప్పటికే ఇలాంటి డ్రోన్లను ఆర్మీ అధికారులు బోర్డర్లో గుర్తించి వాటిని పేల్చి వేశారు. కాగా తాజాగా మరో డ్రోన్ ఇండియా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ఓ ఏకే 47 తుపాకీ, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోపును పసుపురంగు ప్యాకెట్లో ప్యాక్ చేసి అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల…
గత కొంతకాలంగా లద్దాఖ్ సరిహద్దుల్లో ఇండియా-చైనా దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నెపథ్యంలో ఇండియా తూర్పు లద్దాఖ్ లో అధునాతమైన ఆయుధాలను మోహరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చేతికి ఓ అధునాతనమైన ఆయుధం లభించింది. ఫార్వార్డ్ ఏరియాల్లో తొలిసారిగా కే9 వజ్ర అనే శతఘ్నలను మోహరించారు. ఈ కే 9 వజ్ర శతఘ్నలు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శతృ స్థావరాలను ద్వంసం చేయగల శక్తిని కలిగి…
భారత్లోని పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చిరించాయి. భారత్లోని చొరబడేందుకు 40మంది ఆఫ్ఘన్ ఉగ్రవాదులు పన్నాగం పన్నుతున్నట్టు నిఘా వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. పాకిస్తాన్ గూడాచార సంస్థ ఐఎస్ఐ మద్ధతుతో భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చిరించాయి. జమ్మూకాశ్మీర్ గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దేశంలో రాబోయే పండగ రోజుల్లో దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతున్నట్టు…
శ్రీనగర్లో తొలిసారిగా ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 26 వ తేదీన శ్రీనగర్లో ఎయిర్షోను నిర్వహించనున్నారు. ఫ్రీఢమ్ ఫెస్టివల్ పేరుతో ఈ ఎయిర్షోను నిర్వహించనున్నారు. ఈ ఎయిర్షోకు మిగ్ 21, సుఖోయ్ 30 విమానాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒకప్పుడు ఉగ్రవాదం కారణంగా నిత్యం తుపాకుల మొతతో దద్దరిల్లిపోయే శ్రీనగర్, దాల్ సరస్సులు ఇప్పుడు కొత్త తేజస్సును నింపుకున్నాయి. జమ్మూకాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తరువాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాశ్మీర్లోని యువతను ఎయిర్ఫోర్స్, విమానయానరంగం…
జమ్మూకాశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు భద్రతా బలగాలకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తాలిబన్ల నుంచి ఇతర దేశాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. తాలిబన్లను ఎదుర్కొనడానికి అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ తాలిబన్లు జమ్మూకాశ్మీర్లో ఉగ్రచర్యలకు తెగబడితే దానిని ఎలా ఎదుర్కోవాలి, వారిని ఎలా తరిమికొట్టాని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి వంటి…
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. స్థానిక పార్టీలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించినా.. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. దీనిపై దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించగా.. మరికొందరు వ్యతిరేకించారు.. ఇక, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా.. గట్టిగా ఈ…
జమ్మూకశ్మీర్ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎవరైతే రాళ్లు రువ్వుతారో, విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొంటారో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చేయాలని పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటుగా, దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యవహారాల్లో పాల్గొనే వ్యక్తులు విదేశాలకు వెళ్లకుండా చూడాలని, అలాంటి వారికి పాస్పోర్ట్ జారీ చేయకూడదని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాస్పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించి దృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో వీటిని కూడా పరిశీలించాలని పోలీసు శాఖ…
కరుగుడట్టిన ఉగ్రవాదిని జమ్మూ కశ్మీరులో ఖతం చేశాయి భద్రతాబలగాలు.. అత్యంత భయానక ఉగ్రవాది అయిన ఇస్మాయిల్ భాయ్ వురపు లంబును… ఇవాళ మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ… పుల్వామాలోని నాగ్బెరన్-తార్సర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఇ-మహ్మద్ (జెఎమ్) తో అనుబంధంగా ఉన్న అగ్రశ్రేణి పాకిస్థాన్ తీవ్రవాది హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపోరా పట్టణ శివారులో జరిగిన ఎన్కౌంటర్లో ఇంకా గుర్తించబడని మరో ఉగ్రవాది కూడా మరణించాడు. ఘటనా స్థలం నుంచి…
జమ్ముకశ్మీర్లోని దేవాలయాలపై దాడులు చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్లాన్ చేశారా అంటే అవుననే అంటోంది ఇంటిలిజెన్స్ వ్యవస్థ. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆగస్టు 15 వ తేదీన ఆలయాలను లక్ష్యంగా చేసుకొని పాక్ ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించడంతో భద్రతాబలగాలు అప్రమత్తం అయ్యాయి. పాక్ ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు దాడులకు వ్యూహం పన్నాయని ఇంటిలిజెన్స్…
జమ్మూకశ్మీర్ ప్రస్తుతం యూనియన్ టెరిటరీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిస్థితి కొంతకాలం మాత్రమే ఉంటుందని, తప్పకుండా జమ్మూకశ్మీర్కు తిరిగి రాష్ట్రహోదా కల్పిస్తామని గతంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి నేతలకు హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడిన తరువాత రాష్ట్రహోదాను ఇస్తామని చెప్పారు. దీనిపై మరోసారి రాజ్యసభలో కేంద్రహోంశాఖ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. సరైన సమయంలో జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామని అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ఆ దిశగా…