ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. హమాస్పై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల ఆందోళనను పెంచింది.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఖైదీల మార్పిడికి ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ఉగ్రవాద గ్రూపులోని ఒకరు తెలిపినట్లు తెలిసింది. అమెరికా మద్దతుతో, ఖతార్ ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుకుంటోంది.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్ ప్రజలపై చేసిన క్రూరమైన దాడులను ఖండించిన ఒక రోజు తర్వాత, సోమవారం పాలస్తీనియన్లకు మద్దతుగా కాంగ్రెస్ బహిరంగంగా ముందుకు వచ్చింది.
ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ గురించి చాలా మంది కథలు కథలుగా చెప్పుకుంటారు. వీటిలో కొన్ని కథలు ఆశ్యర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన గూఢచర్యల్లో సంస్థల్లో మొసాద్ కూడా ఒకటి కావడం గమనార్హం.
హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది గాజాపై పూర్తి దిగ్బంధనం విధించబోతున్నట్లు ఇజ్రాయెల్ సోమవారం తెలిపింది. ఆ ప్రాంతానికి నీరు, ఆహారం, ఇంధనాన్ని అనుమతించడంపై నిషేధం విధించినట్లు తెలిసింది.
గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా చొరబడిన తరువాత దక్షిణాన ఉన్న భూభాగాలపై తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ మేరకు సీఎన్ఎన్ సోమవారం నివేదించింది. మూడు రోజుల పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు.
Israel-Hamas War: గత వారాంతంలో ప్రపంచంలో రెండు దేశాల మధ్య మరో యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్లో ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త యుద్ధం మొదలైంది.
Israel Palestine: పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాద సంస్థ అక్టోబర్ 6న ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఆ సమయంలో వారు 5000 రాకెట్లను ప్రయోగించారు. ఇది ఇజ్రాయెల్ ను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
అక్టోబర్ 7, 2023, ఉదయం సమయం. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించింది. సాధారణ రోజుల మాదిరిగానే ప్రజలు నిద్రలేచిన తర్వాత వారి రోజువారీ కార్యకలాపాల వైపు వెళ్లవలసి ఉండగా, వందలాది మంది ప్రజలు నిద్ర నుంచి మేల్కొనలేని విధంగా ఉదయం ప్రారంభమైంది.
ఇజ్రాయెల్పై హమాస్ దాడిని కాంగ్రెస్ ఖండించింది. పాలస్తీనా ప్రజల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో విశ్వసిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.