India vs Pakistan: పాకిస్తాన్ హమాస్కి మద్దతు తెలుపకుండా ఇండియా గెలిచింది.. క్రికెట్ మ్యాచ్పై ఇజ్రాయిల్ రాయబారి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. శనివారం జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఏ దశలోనూ భారత్ జట్టుకు పోటీగా నిలబడలేదు. ఐసీసీ ఈవెంట్లలో మరోసారి భారత్ చేతిలో 8వసారి ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచులో ఓ అభిమాని ఇజ్రాయిల్ కి మద్దతుగా పోస్టర్లను ప్రదర్శించారు. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఉన్న ఫోటోలు కలిగిన పోస్టర్లను సదరు వ్యక్తి ప్రదర్శించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలను భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నౌర్ గిలోన్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ దృశ్యం నన్ను కదిలించిందని కామెంట్ చేశారు.
Read Also: Nitish Kumar: నితీష్ కుమార్ ‘రెండో గాంధీ’.. బీహార్లో కొత్త వివాదం..
Also Read
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
హమాస్కు పాకిస్తాన్ మద్దతు తెలిపకుండా భారత్ విజయం అడ్డుకుందని అందుకు నేను సంతోషిస్తున్నానని గిలోన్ అన్నారు. మ్యాచ్ సమయంలో భారత స్నేహితులు ఇజ్రాయిల్ కి తమ సంఘీభావం ప్రకటించడం మమ్మల్ని కదిలించింది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యుద్దం చేస్తున్న ఇజ్రాయిల్ కి భారత్ మద్దతుగా నిలుస్తోంది అని ఓ అభిమాని పోస్టర్లు పట్టుకున్న ఫోటోలను గిలోన్ పోస్ట్ చేశారు. అంతకుముంద శ్రీలంకతో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హమాస్ లోని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ దృశ్యం వైరల్ అయింది.
ఇజ్రాయిల్-హమాస్ పోరులో ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇజ్రాయిల్ కి అండగా ఉంటామని ప్రకటించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో మాట్లాడుతూ, మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. దీనిపై రాయబారి గిలోన్ మాట్లాడుతూ.. చాలా మంది భారతీయులు ఇజ్రాయిల్ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, దీంతో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ మరో విభాగాన్ని ఏర్పాటు చేయమని అభివర్ణించారు. ఉగ్రవాద చర్యలను మొదట ఖండించిన ప్రపంచ నేతల్లో ప్రధాని మోడీ ఒకరని ప్రశంసించారు.
हमें खुशी है कि #CWC23 में #INDvPAK मैच में #भारत 🇮🇳 विजयी हुआ और पाकिस्तान अपनी जीत हमास के आतंकवादियों को समर्पित नहीं कर पाया।
हम हमारे भारतीय मित्रों द्वारा मैच के दौरान पोस्टर दिखाकर कर इज़राइल 🇮🇱 के साथ अपनी एकजुटता दिखाने से हम बेहद भाव विभोर हैं। 🙏
We are happy that… pic.twitter.com/fIDY4Ap7aJ
— Naor Gilon🎗️ (@NaorGilon) October 14, 2023
తాజావార్తలు
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..