India vs Pakistan: పాకిస్తాన్ హమాస్కి మద్దతు తెలుపకుండా ఇండియా గెలిచింది.. క్రికెట్ మ్యాచ్పై ఇజ్రాయిల్ రాయబారి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. శనివారం జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఏ దశలోనూ భారత్ జట్టుకు పోటీగా నిలబడలేదు. ఐసీసీ ఈవెంట్లలో మరోసారి భారత్ చేతిలో 8వసారి ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచులో ఓ అభిమాని ఇజ్రాయిల్ కి మద్దతుగా పోస్టర్లను ప్రదర్శించారు. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఉన్న ఫోటోలు కలిగిన పోస్టర్లను సదరు వ్యక్తి ప్రదర్శించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలను భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నౌర్ గిలోన్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ దృశ్యం నన్ను కదిలించిందని కామెంట్ చేశారు.
Read Also: Nitish Kumar: నితీష్ కుమార్ ‘రెండో గాంధీ’.. బీహార్లో కొత్త వివాదం..
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
హమాస్కు పాకిస్తాన్ మద్దతు తెలిపకుండా భారత్ విజయం అడ్డుకుందని అందుకు నేను సంతోషిస్తున్నానని గిలోన్ అన్నారు. మ్యాచ్ సమయంలో భారత స్నేహితులు ఇజ్రాయిల్ కి తమ సంఘీభావం ప్రకటించడం మమ్మల్ని కదిలించింది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యుద్దం చేస్తున్న ఇజ్రాయిల్ కి భారత్ మద్దతుగా నిలుస్తోంది అని ఓ అభిమాని పోస్టర్లు పట్టుకున్న ఫోటోలను గిలోన్ పోస్ట్ చేశారు. అంతకుముంద శ్రీలంకతో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హమాస్ లోని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ దృశ్యం వైరల్ అయింది.
ఇజ్రాయిల్-హమాస్ పోరులో ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇజ్రాయిల్ కి అండగా ఉంటామని ప్రకటించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో మాట్లాడుతూ, మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. దీనిపై రాయబారి గిలోన్ మాట్లాడుతూ.. చాలా మంది భారతీయులు ఇజ్రాయిల్ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, దీంతో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ మరో విభాగాన్ని ఏర్పాటు చేయమని అభివర్ణించారు. ఉగ్రవాద చర్యలను మొదట ఖండించిన ప్రపంచ నేతల్లో ప్రధాని మోడీ ఒకరని ప్రశంసించారు.
हमें खुशी है कि #CWC23 में #INDvPAK मैच में #भारत 🇮🇳 विजयी हुआ और पाकिस्तान अपनी जीत हमास के आतंकवादियों को समर्पित नहीं कर पाया।
हम हमारे भारतीय मित्रों द्वारा मैच के दौरान पोस्टर दिखाकर कर इज़राइल 🇮🇱 के साथ अपनी एकजुटता दिखाने से हम बेहद भाव विभोर हैं। 🙏
We are happy that… pic.twitter.com/fIDY4Ap7aJ
— Naor Gilon🎗️ (@NaorGilon) October 14, 2023
తాజావార్తలు
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!