Iran Israel War: హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా లక్ష్యాలను ఎంపిక చేసి నాశనం చేస్తోంది. హసన్ నస్రల్లాను చంపిన తర్వాత, ఇజ్రాయెల్ మీడియా ఇప్పుడు అతని వారసుడు హషీమ్ సఫీద్దీన్ను చంపినట్లు పేర్కొంది. అందిన సమాచారం ప్రకారం, బీరూట్లో హషీమ్ సఫీద్దీన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ముగ్గురు ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గురువారం అర్ధరాత్రి భీకరమైన వైమానిక దాడులను చేశాయని.,…
పశ్చిమాసియా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. వైట్హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందని బైడెన్ చెప్పారు.
ఇజ్రాయెల్ చరిత్రలో మరొక అద్భుతమైన ఘటన ఆవిష్క్రతమైంది. గత కొన్ని నెలలుగా గాజాతో ఎడతెరిపిలేకుండా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. దాదాపుగా గాజాను మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ సైన్యంలో ఇదంతా ఒకెత్తు అయితే.. గురువారం ఐడీఎఫ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన అమ్మాయిను ఐడీఎఫ్ దళాలు రక్షించాయి.
Iran Israel: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం రాబోతోందా..? అనే చర్చ నడుస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాని ఇజ్రాయిల్ దారుణంగా దెబ్బతీసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాతో పాటు దాని ప్రధాన కమాండర్లను దాడుల్లో హతమార్చింది.
అనుకున్నట్టే అయింది.. పశ్చిమాసియా భగ్గుమంటోంది. తమ శత్రుమూకలను వేటాడి వెంటాడి మట్టుపెడుతున్న ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్.. ఇరాన్ ను హెచ్చరించింది. అదే జరిగితే మరింతగా విరుచుకుపడతాం అని ఇరాన్ బదులిచ్చింది. మధ్యలో అమెరికా జోక్యం చేసుకుంది. దీంతో యుద్ధం వచ్చేసిందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తీవ్రవాద సంస్థలకు మద్దతుగా…
Israel-Iran War: ఇజ్రాయిల్-హిజ్బుల్లా-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయిల్ హతమార్చింది. నస్రల్లానే కాకుండా హిజ్బుల్లా ప్రధాన కమాండర్లు అందరిని చంపేసింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయిల్పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. దీంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాలు నెలకొన్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
మంగళవారం అర్థరాత్రి ఇరాన్ ఇజ్రాయెల్పై వందలాది క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, మొసాద్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించారు. చాలా క్షిపణులను కూల్చివేయడంలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ విజయం సాధించింది. ఇందులో జోర్డాన్తో పాటు అమెరికా నుంచి ఇజ్రాయెల్ సాయం పొందినట్లు తెలిసింది.
లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాను పూర్తిగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేస్తోంది. మొదట సంస్థ అధిపతి సయ్యద్ హసన్ నస్రల్లా, అతని కుమార్తె, అనేక మంది టాప్ కమాండర్లు చంపబడ్డారు. అదే సమయంలో, సిరియా రాజధాని డమాస్కస్లోని ఒక ఫ్లాట్పై జరిగిన దాడిలో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ మరణించాడు. హిజ్బుల్లాకు చెందిన మీడియా కూడా దీనిని ధ్రువీకరించింది
ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పెరుగుతోంది. కాగా, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుత ఛైర్పర్సన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.