Benjamin Netanyahu: ఇరాన్ అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోం..
- ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు..
- ఇరాన్ అణు.. చమురు స్థావరాలపై దాడి చేయబోమని వెల్లడించిన నెతన్యాహూ..
Benjamin Netanyahu: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు నెతన్యాహు చెప్పినట్లు యూఎస్ కు చెందిన పలు మీడియాల్లో కథనాలు వెల్లడించాయి. కాగా, ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ టైంలో ఇరువురు నేతలు ఇరాన్పై ప్రతీకార దాడులకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పుకొచ్చారు. ఇరాన్ చమురు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇంధన ధరలు పెరిగిపోతాయని పలువురు విశ్లేషకులు తెలిపినట్లు సమాచారం. ఇది అమెరికా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.. కావున ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయం ఆలోచించాలని నెతన్యాహుకు జో బైడెన్ సూచించారు. ఆయన సూచనలతో ఇరాన్ చమురు స్థావరాలపై దాడులను ఇజ్రాయెల్ విరమించుకున్నట్లు సమాచారం.
Read Also: Group-1 Prelims: గ్రూప్-1 మెయిన్స్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఈనెల 21న పరీక్షలపై..
Also Read
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
అయితే, తాము అమెరికన్ ప్రభుత్వ మాటలను వింటాం.. కానీ, ఇజ్రాయెల్ దళాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది. నెతన్యాహుకు యూఎస్ విజ్ఞప్తులు ఇజ్రాయెల్లోని ప్రజల డిమాండ్తో సమానమని ఆ దేశ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ తెలిపారు. అలాగే, అమెరికా ఆయుధాలతోనే ఇజ్రాయెల్ పోరాడుతుందని వెల్లడించారు. అయితే, ఈ అంశాలపై వైట్హౌస్ స్పందించలేదు.
Read Also: CSIR UGC NET Result 2024: NET జూన్ పరీక్ష ఫలితాల విడుదల.. ఫలితాలు చెక్ చేసుకున్నారా?
ఇక, ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణలతో దాడి చేసింది. దాదాపు 180 క్షిపణులతో ఇజ్రాయెల్పై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని బెంజమిన్ నెతాన్యహు ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే ఇరాన్కు చెందిన అణు, చమురు స్థావరాలను ధ్వంసం చేసేందుకు చర్చలు చేసినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇరాన్ అణు స్థావరాలపై కాకుండా ప్రత్యమ్నాయంగా దాడి చేయాలని బహిరంగంగానే ఇజ్రాయెల్కు సూచనలను చేయడంతో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది.
తాజావార్తలు
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో