Benjamin Netanyahu: ఇరాన్ అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోం..
- ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు..
- ఇరాన్ అణు.. చమురు స్థావరాలపై దాడి చేయబోమని వెల్లడించిన నెతన్యాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు నెతన్యాహు చెప్పినట్లు యూఎస్ కు చెందిన పలు మీడియాల్లో కథనాలు వెల్లడించాయి. కాగా, ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ టైంలో ఇరువురు నేతలు ఇరాన్పై ప్రతీకార దాడులకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పుకొచ్చారు. ఇరాన్ చమురు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇంధన ధరలు పెరిగిపోతాయని పలువురు విశ్లేషకులు తెలిపినట్లు సమాచారం. ఇది అమెరికా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.. కావున ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయం ఆలోచించాలని నెతన్యాహుకు జో బైడెన్ సూచించారు. ఆయన సూచనలతో ఇరాన్ చమురు స్థావరాలపై దాడులను ఇజ్రాయెల్ విరమించుకున్నట్లు సమాచారం.
Read Also: Group-1 Prelims: గ్రూప్-1 మెయిన్స్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఈనెల 21న పరీక్షలపై..
Also Read
- Tarique Rahman: నవంబర్లో భారత్కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
- Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
- KFC పార్కింగ్లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
అయితే, తాము అమెరికన్ ప్రభుత్వ మాటలను వింటాం.. కానీ, ఇజ్రాయెల్ దళాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది. నెతన్యాహుకు యూఎస్ విజ్ఞప్తులు ఇజ్రాయెల్లోని ప్రజల డిమాండ్తో సమానమని ఆ దేశ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ తెలిపారు. అలాగే, అమెరికా ఆయుధాలతోనే ఇజ్రాయెల్ పోరాడుతుందని వెల్లడించారు. అయితే, ఈ అంశాలపై వైట్హౌస్ స్పందించలేదు.
Read Also: CSIR UGC NET Result 2024: NET జూన్ పరీక్ష ఫలితాల విడుదల.. ఫలితాలు చెక్ చేసుకున్నారా?
ఇక, ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణలతో దాడి చేసింది. దాదాపు 180 క్షిపణులతో ఇజ్రాయెల్పై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని బెంజమిన్ నెతాన్యహు ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే ఇరాన్కు చెందిన అణు, చమురు స్థావరాలను ధ్వంసం చేసేందుకు చర్చలు చేసినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇరాన్ అణు స్థావరాలపై కాకుండా ప్రత్యమ్నాయంగా దాడి చేయాలని బహిరంగంగానే ఇజ్రాయెల్కు సూచనలను చేయడంతో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది.
తాజావార్తలు
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..