Home
Indian National Congress
Indian National Congress News
-
AI Summit: కాంగ్రెస్ కార్యకర్తలను చితక్కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్..
AI Summit: ప్రపంచ వేదికపై భారతదేశ పరువు పోయే విధంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సమావేశంలో ఊహించని సంఘటన జరిగింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తమ టీ షర్టుల్ని తీసేసి, నినాదాలు చేశారు. ఏఐ ఎక్స్పో హాల్లోకి ప్రవేశించి, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ను ఉద్దేశిస్తూ, టీషర్టులు ప్రదర్శించారు. ప్రధాని మోడీ ట్రంప్నకు లొంగిపోయారని అన్నారు. Read Also:… -
Ibrahimpatnam Drama: గెలిచినా దక్కని చైర్మన్ పదవి.! హైకోర్టు స్టేతో నిలిచిన ఇబ్రహీంపట్నం ఎన్నికల ఫలితం.!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతూ చివరకు హైకోర్టు మెట్లెక్కింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఒక కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ ఎన్నికపై కీలకమైన స్టే విధించింది. బుధవారం (ఫిబ్రవరి 18) ఉదయం దీనిపై తుది విచారణ జరగనుంది. ఈ వివాదం వెనుక ఉన్న ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీకి చెందిన 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల… -
Kyathanpalli High Tension: క్యాతనపల్లిలో పొలిటికల్ వార్.. చైర్మన్ ఎన్నిక వాయిదా.. మళ్ళీ క్యాంపులకు కౌన్సిలర్లు..!
క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయి, మళ్లీ ‘క్యాంపు’ రాజకీయాలు మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం నేడు (ఫిబ్రవరి 17) క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, ఎన్నిక ప్రారంభమయ్యే సమయంలో… -
Errabelli Dayakar Rao : తొర్రూరు కాంగ్రెస్ కైవసం.. కన్నీళ్లు పెట్టుకు ఎర్రబెల్లి..
ఉత్కంఠకు తెరదించుతూ తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరిగిన హోరాహోరీ పోరులో చివరకు అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థిని వరించింది. అయితే, తన రాజకీయ కంచుకోటగా భావించే తొర్రూరు మున్సిపాలిటీ చేజారిపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనై మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఇరు వర్గాల బలాబలాలు సమానంగా ఉండటంతో అధికారులు ‘లక్కీ డ్రా’ పద్ధతిని… -
Congress: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బృందం.. కాంగ్రెస్ అధిష్టానంతో కీలక భేటీ.. అజెండాలో ఆ అంశాలేనా.?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ బృందం ఈ నెల 19న ఢిల్లీకి వెళ్లనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణలు, పార్టీ బలోపేతం , భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఏఐసీసీ (AICC) అగ్ర నాయకత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గంలోని పలువురు కీలక మంత్రులు ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు.… -
KTR : రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఇవాళ్టి పరిణామాలే సాక్ష్యం
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో ఈరోజు జరిగిన దాడులు, కిడ్నాప్లే నిదర్శనమని ఆయన విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ‘గూండాగిరి’కి పాల్పడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో సంచలనం.. ముగ్గురు తెలుగు స్టూడెంట్స్కు 100% పర్సంటైల్ బీఆర్ఎస్ మాజీ మంత్రులు,… -
Bhatti Vikramarka : ప్రజల నమ్మకమే గెలిచింది.. మధిరను మోడల్ సిటీగా మారుస్తాం..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయంపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మధిరలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పట్టణాల్లో కాంగ్రెస్కు ఈ స్థాయిలో ప్రజలు పట్టం కట్టడం చారిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. అభివృద్ధి, సంక్షేమం , ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.… -
Chairmans Desk : స్థానిక గెలుపులతో సరిపోతుందా? కాంగ్రెస్ భవిష్యత్ స్ట్రాటజీ ఏంటి?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్షాలపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. మెరుగైన ఫలితాల సాధనతో.. క్షేత్రస్థాయిలో కూడా కాంగ్రెస్ క్యాడర్ బలోపేతమైంది. ఈ విషయంలో రేవంత్ అండ్ టీమ్ సక్సెస్ అయ్యారని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దగ్గర్నుంచి తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపోల్స్లో కాంగ్రెస్ విజయాల ఊపు కొనసాగుతోంది. అంతమాత్రాన మున్సిపల్ ఫలితాలను రెఫరెండంగా చూడలేం. ఎందుకంటే కొన్నిచోట్ల ఇది రెఫరెండం… -
Jagga Reddy : మాట నిలబెట్టుకున్న జగ్గారెడ్డి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి , సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం, జగ్గారెడ్డి తాను అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం చైర్మన్ , వైస్ చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. Amazon & Flipkart లో రచ్చ.! Moto G57 Power పై భారీ డిస్కౌంట్.! జగ్గారెడ్డి ప్రకటించిన వివరాల… -
Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
Madhira Muncipality : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఈ విజయం రాష్ట్ర రాజకీయాల్లో భట్టి విక్రమార్క పరపతిని మరోసారి చాటిచెప్పింది. మధిర మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 22 వార్డులకు గాను, కాంగ్రెస్ పార్టీ , ఆ పార్టీ బలపరిచిన టీడీపీ…
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!