కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్మీ స్కీమ్ ‘ అగ్నిపథ్’పై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, హర్యానాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ ఆందోళనలకు పాల్పడ్డారు. బీహార్ లోని పలు జిల్లాల్లో గత మూడు రోజుల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రైళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. శుక్రవారం తెలంగాణలో కూడా అల్లర్లు జరిగాయి. సికింద్రాబాద్ స్టేషన్ లో ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల్లో ఒక యువకుడు మరణించాడు. ఇదిలా ఉంటే…
కేంద్ర ప్రభుత్వం సైన్యంలో తీసుకువచ్చిన ‘ అగ్నిపథ్ స్కీమ్’ పై ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్ తో పాటు హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అగ్నిపథ్ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ రోజు సికింద్రాబాద్ లో కూడా ఆందోళనకారులు రైల్వే స్టేషన్ లోని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభించబోతోంది. తర్వలోనే రిక్రూట్మెంట్ ప్రారంభం కానుందని.. రాబోయే 2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ అవుతుందని.. ఆర్మీ…
భారత దేశ సైన్యాన్ని మరింత సమర్థంగా తీర్చి దిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్ స్కీమ్’ని తీసుకువచ్చింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు జూన్ 14న ఈ స్కీమ్ ను ప్రకటించారు. భారతీయ సైన్యంలో యువరక్తాన్ని ప్రవేశపెట్టడంతో పాటు సైన్యం బడ్జెట్ లో పెన్షన్లకు వెచ్చించే నిధులకు కోత వేయడంతో పాటు ఈ నిధులను ఆధునిక ఆయుధాల కొనుగోలుకు వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 17.5…
కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ‘ అగ్ని పథ్’ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత కొంతమంది ఈ స్కీమ్ ను వ్యతిరేఖిస్తున్నారు. ప్రస్తుతం బీహర్, మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ ఆశావహులు తీవ్ర ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ లో పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. రైల్వే ట్రాకులపై టైర్లు వేసి కాల్చారు. మూడు రైళ్ల బోగీలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. చాప్రా, గోపాల్…
భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, జీతం, పెన్షన్ బిల్లులను తగ్గించడంతో పాటు ఆధునాతన ఆయుధాలను సేకరణ కోసం నిధులను ఖర్చు చేయాలనే లక్ష్యంతో అగ్నిపథ్ పథకాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, దేశ త్రివిధ దళాల అధిపతులతో కలిసి ప్రకటించారు. రాజ్ నాథ్ సంగ్ ఇది చారిత్రక నిర్ణయం అని అన్నారు. అగ్నిపథ్ పథకంలోని ముఖ్యాంశాలు: పథకం కింద 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు ఉన్న 45,000 మంది యువతీయువకులను…
నాగాలాండ్ లో గతేడాది మిలిటెంట్లని పొరబడుతూ.. ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 13 మంది అమాయక పౌరులు చనిపోయారు. డిసెంబర్ 4, 2021 న నాగాలాంట్ లోని మోన్ జిల్లా ఓటింగ్ లో ఈ ఘటనల జరిగింది. తాజాగా ఈ ఘటనలో సంబంధం ఉన్న ఓ ఆర్మీ అధికారితో పాటు 29 మంది సైనికులపై ఛార్జ్ షీట్ దాఖలైంది. నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మొత్తం 30 మంది పేర్లను…
బోరు బావుల్లో ప్రమాదవశాత్తు పడి మరణించిన ఉదంతాలు ఎన్నో చూశాం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బోరుబావిలో పడి చనిపోయిన ఘటనలు జరిగాయి. ఆడుకుంటూ వెళ్లి తెరిచి ఉన్న బోరు బావుల్లో పడి మరణించారు. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఉదంతాల్లో మరణించిన వారే ఎక్కువ. అతి తక్కువ శాతం మంది బతికి బయటపడి మృత్యుంజయులుగా నిలుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్ లో జరిగింది. కానీ ఇండియన్ ఆర్మీ రెస్క్యూ చేయడంతో 18 నెలల…
ద్వీప దేశం శ్రీలంక రగులుతోంది. మొత్తం దేశం రావణకాష్టంలా మారుతోంది. తీవ్రమైన ఆర్థిక, ఆహారం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పూర్తిగా చెప్పాలంటే రాజపక్సే ప్రభుత్వం శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర ఆహార కొరతకు కారణం అయ్యాయి. మరోవైపు ఆర్థిక పరిస్థితికి మించి విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి అప్పులు తీసుకుంది. అప్పులు చెల్లించలేక హంబన్ టోటా రేవును చైనాకు లీజుకు ఇచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని…
చేతక్ హెలికాప్టర్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ లో ఛేతక్ హెలికాప్టర్ల వజ్రోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. చేతక్ హెలికాప్టర్లు 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హకీం పేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. చేతక్ హెలికాఫ్టర్ ఒక మిషన్…
భారత సైన్యం అమ్ములపొదిలోని శక్తిమంతమైన ఆయుధంగా పరిగణించే బ్రహ్మోజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. బుధవారం భారత ఆర్మీ అధికారులు ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో విజయవంతంగా పరీక్షించారు. రష్యా సహకారంతో డీఆర్డీవో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణితో భూతలం నుంచి భూతలానికి, భూమి నుంచి యుద్ధ విమానాలు, యుద్ద నౌకల వంటి టార్గెట్లను ధ్వంసం చేయవచ్చు. తాజాగా బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్ పెరగ్గా.. ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా…