Nagaland: ప్రజలను చంపిన నేరంలో 30 మంది ఆర్మీ సిబ్బందిపై ఛార్జ్ షీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగాలాండ్ లో గతేడాది మిలిటెంట్లని పొరబడుతూ.. ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 13 మంది అమాయక పౌరులు చనిపోయారు. డిసెంబర్ 4, 2021 న నాగాలాంట్ లోని మోన్ జిల్లా ఓటింగ్ లో ఈ ఘటనల జరిగింది. తాజాగా ఈ ఘటనలో సంబంధం ఉన్న ఓ ఆర్మీ అధికారితో పాటు 29 మంది సైనికులపై ఛార్జ్ షీట్ దాఖలైంది. నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మొత్తం 30 మంది పేర్లను కోర్టుకు సమర్పించింది. ఈ దాడిలో పాల్గొన్న ఆర్మీ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్, ఎంగేజ్మెంట్ నియమాలు పాటించలేదని సిట్ ఆరోపించింది.
ఎన్ఎస్సిఎన్ (ఖప్లాంగ్)కి చెందిన మిలిటెంట్ల కదలికలపై సమాచారం రావడంతో ఆర్మీ కౌంటర్ ఇన్సర్జెన్సీ యూనిట్, 21 పారా స్పెషల్ ఫోర్సెస్ గాలింపు చేపట్టాయి. మయన్మార్ సరిహద్దు జిల్లా అయిన మోన్ లోని ఓటింగ్ ప్రాంతంతో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అప్పుడే బొగ్గు గని నుంచి వస్తున్న కార్మికులు పికప్ ట్రక్ ను చూసి, ఉగ్రవాదులని భావించిన ఆర్మీ వారిపై కాల్పులు జరిపింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 13 మది మరణించారు.
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
అయితే తాజాగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్న సైనికులపై చర్యలు తీసుకునేందుకు నాగాలాండ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతిని కోరింది. ఈ సంఘటనల జరిగిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) మరోసారి చర్చకు వచ్చింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్లు వినిపించాయి.
ఏఎఫ్ఎస్పీఏ చట్టం భద్రతా బలగాలకు విశేష అధికారాన్ని కట్టబెడుతుంది. ఈ చట్టం కింద ఎవరినైనా చంపినట్లయితే భద్రతా బలగాలకు అరెస్ట్, ప్రాసిక్యూషన్ నుమచి మినహాయింపు ఇవ్వడంతో పాటు, ఎవరినైనా ముందస్తు అరెస్టు చేసే అధికారాన్ని కట్టబెడుతుంది. మోన్ జిల్లా ఘటనలో నాగాలాండ్ ప్రభుత్వంతో పాటు ఆర్మీ కూడా విచారణ జరుపుతోంది. మేజర్ జనరల్ నేతృత్వంలోని ఎంక్వైరీ టీం ఇప్పటికే ఓటింగ్ గ్రామాన్ని సందర్శించారు. ఘటనలకు దారి తీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
తాజావార్తలు
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!