Pakistan Violates Ceasefire: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని కనాచక్ సెక్టార్లో సాధారణ నిఘా నిర్వహిస్తున్న భారత రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ (RPA/Drone) లక్ష్యంగా పాక్ దళాలు కాల్పులు జరిపాయి. అయితే, భారత డ్రోన్కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అది సురక్షితంగా వెనక్కి వచ్చింది. READ ALSO: Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్ పలు నివేదికల ప్రకారం..…
S-400 missile system: దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు ఓకే చెప్పింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సమావేశంలో రూ. 2.38 లక్షల కోట్ల విలువైన రక్షణ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ కొనుగోలు భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో…
ఆర్మీలో చేరాలని, దేశ సేవలో భాగం కావాలని యువత కలలు కంటుంటారు. ఆర్మీకి సెలెక్ట్ అయ్యేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. మరి మీరు కూడా భారత సైన్యంలో చేరాలనుకుంటున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. అగ్నివీర్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు/ఇతర ర్యాంకుల నియామకాల కోసం ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఆర్మీ సీఈఈ 2026) రిజిస్ట్రేషన్ తేదీలను భారత సైన్యం ప్రకటించింది. అధికారిక వివరాల ప్రకారం, ఆర్మీ సీఈఈ 2026 కోసం దరఖాస్తులు ఈరోజు, ఫిబ్రవరి 3న ప్రారంభమయ్యాయి.…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో కిష్త్వార్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం మధ్యాహ్నం నుంచి కాల్పులు ప్రారంభయ్యాయి. సైన్యానికి చెందిన ఏడుగురు సైనికులు ఈ ఆపరేషన్లో గాయపడినట్లు తెలుస్తోంది. కఠిమైన పర్వత ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి.
Operation Sindoor: భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా కొనసాగుతోందని, భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి దిగితే, సమాధానం చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. సరిహద్దు వెంబడి 8 ఉగ్రవాద శిబిరాలు చురుకుగా ఉన్నాయని, వీటిలో 6 నియంత్ర రేఖ వెంబడి, మరో రెండు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ద్వివేదీ ఈ వ్యాఖ్యలు చేశారు. Read…
Droupadi Murmu: 10 ఏళ్ల బాలుడు శ్రవణ్ సింగ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’’ దక్కింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో యుద్ధభూమిలో ఉన్న మన జవాన్లకు నీరు, పాలు, లస్సీ అందిస్తూ తన దేశభక్తిని చాటుకున్నాడు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని తన ఇంటికి సమీపంలో ఉన్న పాక్ సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యానికి క్రమం తప్పకుండా సేవ చేశాడు. శ్రవణ్ సింగ్ కనబరిచిన దేశభక్తికి రాష్ట్రపతి నుంచి శుక్రవారం ఈ పురస్కారం…
Defence Deal: భారతదేశానికి 93 మిలియన్ డాలర్ల ఆయుధాల అమ్మకాలను అమెరికా ఆమోదించింది. ఇరు దేశాల మధ్య భారీ డిఫెన్స్ డీల్ ఓకే అయింది. ఈ డీల్లో భాగంగా అమెరికా భారత్కు యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఎక్స్కాలిబర్ ప్రెసిషన్-గైడెడ్ ఆర్టిలరీ రౌండ్ల కొత్త బ్యాచ్ను అందించేందుకు మార్గం సుగమమైంది.
Rajnath Singh: భారతదేశంలోని 10 శాతం మంది సైన్యాన్ని నియంత్రిస్తున్నారు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, అగ్రకులాలే సైన్యాన్ని నియంత్రిస్తున్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సైన్యం దేశ జనాభాలో 10 శాతం మంది (అగ్రకులాలను సూచిస్తూ) నియంత్రణలో ఉందని మంగళవారం అన్నారు. బీహార్ ఔరంగబాద్లో ప్రచారం చేస్తూ.. దేశ జనాభాలో 10 శాతం మందికి కార్పొరేట్ రంగాలు, బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో అవకాశాలు లభిస్తున్నాయి, సైన్యం కూడా వారి నియంత్రణలో ఉంది అని అన్నారు. మిగిలిన 90 శాతం, వెనుకబడిన తరగతులు, దళితులు, షెడ్యూల్డ్ తెగలు,…
Indian Military: భారత సైన్యం మరింత ఆధిపత్యాన్ని చూపబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చే విధంగా భారత సైన్యానికి రూ. 79,000 కోట్లతో రక్షణ పరికరాల కొనుగోళ్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ‘‘డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్’’ ఆమోదం తెలిపింది.