Rahul Gandhi: దేశ యువతకు ‘అగ్ని పరీక్ష’ పెట్టకండి మోదీ జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ‘ అగ్ని పథ్’ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత కొంతమంది ఈ స్కీమ్ ను వ్యతిరేఖిస్తున్నారు. ప్రస్తుతం బీహర్, మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ ఆశావహులు తీవ్ర ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ లో పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. రైల్వే ట్రాకులపై టైర్లు వేసి కాల్చారు. మూడు రైళ్ల బోగీలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. చాప్రా, గోపాల్ గంజ్, కైమూర్ జిల్లాల్లో ఆందోళన హింసాత్మకంగా మారాయి.
ఇదిలా ఉంటే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘ ర్యాంకు లేదు, పెన్షన్ లేదు. 2 ఏళ్ల నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు, 4 ఏళ్ల నుంచి స్థిరమైన భవిష్యత్తు లేదని.. సైన్యం పట్ల గౌరవం లేదని.. దేశంలోని నిరుద్యోగ వాణిని వినండి, దేశంలోని నిరద్యోగ యువత గొంతు వినండి, వారిని అగ్నిపథ్ లో నిడిపించి వారి సంయమనానికి ‘అగ్నిపరీక్ష’ పెట్టకండి మోదీజీ’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ స్కీమ్ పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సైన్యంలో రిక్రూట్మెంట్ ను ఎందుకు ప్రయోగశాలగా చేస్తున్నారని ప్రశ్నించారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘ అగ్నిపథ్ ’ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆర్మీలో 4 ఏళ్లకు యువతీ యువకులను ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ లోకి రిక్రూట్ చేయనున్నారు. దాదాపుగా 46 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న యువత దీనికి అర్హులు. ఆరు నెలల శిక్షణ అనంతర నాలుగేళ్ల పాటు ఆర్మీలో సేవలు అందించనున్నారు. ఆ తరువాత రూ. 11-12 లక్షల ప్యాకేజీతో రిటైర్మెంట్ కానున్నారు. వీరికి రిటైర్మెంట్ తదనంతరం ఎలాంటి పెన్షన్ సౌకర్యం ఉండదు. అయితే రిక్రూట్ చేసుకున్నవారిలో 25 శాతం మంది మాత్రమే 15 ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేసే అవకాశం కల్పించనున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..