Agnipath: మరోసారి త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రవేశపెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్ ’పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బీహార్,తెలంగాణ, యూపీ,హర్యానా, తమిళనాడు, గుజరాత్ ఇలా పలు రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు, యువత ఆందోళనలు చేశారు. బీహార్, తెలంగాణల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా బీహార్ లో రైల్వే ఆస్తులే లక్ష్యంగా పలు రైళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. స్టేషన్లను ధ్వసం చేశారు. తెలంగాణ సికింద్రాబాద్లో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనల్లో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు.
ఇదిలా ఉంటే కేంద్ర అగ్నిపథ్ పథకాన్ని సమీక్షిస్తోంది. ఈ పథకం కింద చేరిన అగ్నివీరులకు ఇప్పటికే రెండేళ్లు, తర్వాతి రోజు 5 ఏళ్లు మొత్తంగా 7 ఏళ్ల వయోపరిమితిని సడలించారు. దీంతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ ఫోర్సుల్లో ( సీఏపీఎఫ్) కింద ఉన్న అస్సాం రైఫిల్స్, సరిహద్దు భద్రతా దళాలు (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ)లో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మూడేళ్లు వయోపరిమితిని అగ్నివీరుల కోసం సడలించారు. ఇదే విధంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని కోస్ట్ గార్డ్ తో పాటు 16 సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు అగ్నివీరులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇదిలా ఉంటే అగ్నిపథ్ ఆందోళనలు జరుగుతున్న వేళ మరోసారి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. శనివారం కూడా రాజ్నాథ్ సింగ్ వారితో చర్చించారు. తాజాగా ఈ రోజు కూడా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
Delhi | Defence Minister Rajnath Singh meets the three Services chiefs today amid 'Agnipath' protests pic.twitter.com/T14TRP7AAp
— ANI (@ANI) June 19, 2022
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!