Agnipath scheme: ఆర్మీలో కొత్త స్కీమ్ ప్రకటించిన రాజ్ నాథ్ సింగ్.. కీలక అంశాలు ఇవే
భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, జీతం, పెన్షన్ బిల్లులను తగ్గించడంతో పాటు ఆధునాతన ఆయుధాలను సేకరణ కోసం నిధులను ఖర్చు చేయాలనే లక్ష్యంతో అగ్నిపథ్ పథకాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, దేశ త్రివిధ దళాల అధిపతులతో కలిసి ప్రకటించారు. రాజ్ నాథ్ సంగ్ ఇది చారిత్రక నిర్ణయం అని అన్నారు.
అగ్నిపథ్ పథకంలోని ముఖ్యాంశాలు:
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
- New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
- Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
- Nitin Gadkari: "కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్".. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!
పథకం కింద 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు ఉన్న 45,000 మంది యువతీయువకులను నాలుగేళ్ల కాలానికి ఆర్మీ సర్వీసుల్లోకి తీసుకోనున్నారు. రానున్న 90 రోజుల్లో నియామకాలు ప్రారంభం అవుతాయని త్రివిధ దళాల అధిపతులు ప్రకటించారు. ఈ పథకం కింద జూలై 2023 నాటికి తొలి బ్యాచ్ సిద్ధం చేయనున్నారు.
ఈ పథకానికి ఎంపికైన వారిని అగ్నివీర్ లుగా పిలువనున్నారు. ఆన్ లైన్ ద్వారా ఎంపిక జరపనున్నారు. సాధారణంగా ఆర్మీలో ఉండే విద్యార్హతలకు అనుగుణంగానే అగ్నివీర్ల విద్యార్హత ఉంటుందని ఆర్మీ తెలిపింది. అగ్నిపథ్ పథకం కింద మహిళలను కూడా చేర్చుకుంటామని నేవీ చీఫ్ అడ్మినరల్ ఆర్ హరి కుమార్ తెలిపారు. అగ్నివీర్లను శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఆర్మీ సేవల్లోకి తీసుకుంటామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు.
ఈ నాలుగేళ్ల పదవీకాలంలో ఆరు నెలల శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో అగ్నివీర్లకు నెలకు రూ. 30,000-40,000, అలవెన్సులు కూడా చెల్లించనున్నారు. వైద్య, బీమా ప్రయోజనాలు కూడా ఉండనున్నాయి. నాలుగేళ్లు పూర్తి అయిన తర్వాత, ఈ సైనికుల్లో కేవలం 25 శాతం మాత్రమే సైన్యంలో పనిచేయనున్నారు. వీరంతా రెగ్యులర్ క్యాడర్, నాన్ -ఆఫీసర్ ర్యాంకులో పూర్తిగా 15 ఏళ్ల పాటు సేవలు అందించనున్నారు. మిగిలిన వారు రూ. 11 లక్షల- రూ. 12 లక్షల ప్యాకేజీతో సేవల నుంచి నిష్క్రమించనున్నారు. వీరికి పెన్షన్ వంటి ప్రయోజనాలు ఏమీ ఉండవు. విధి నిర్వహణలో గాయం, ప్రాణనష్టం, అంగవైకల్యం ఏర్పడితే వాటికి సంబంధించిన నిబంధనలు కూడా రూపొందించినట్లు సైన్యాధ్యక్షులు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం విజయవంతం అయితే రక్షణ బడ్జెట్ లో రూ. 5.2 లక్షల కోట్లలో సగం వాటా పెన్షన్ బిల్లులలో కోతపడుతుంది. ఈ పథకం వల్ల యువత మరింత మెరుగుపడుతుందని..మరింతగా సాంకేతిక అవగాహన కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!