Home
India
India News
-
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు
రెండేళ్లుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గి పేదలకు ఊరట కలిగించాయి. అయితే ప్రస్తుతం దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి మళ్లీ షాక్ తగలనుంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండోనేషియా. భారత్కు ఎక్కువగా వంటనూనెలు ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట… -
75 శాతం మంది పెద్దలకు వ్యాక్సినేషన్.. ప్రధాని అభినందనలు..
భారతదేశంలోని వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ.. పౌరులకు అభినందనలు తెలియజేశారు.. దేశ జానాభాలో మొత్తం పెద్దలలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఈ మహత్తరమైన ఫీట్ సాధించినందుకు సహకరించిన మా తోటి పౌరులకు అభినందనలు.. మా టీకా డ్రైవ్ను విజయవంతం చేస్తున్న అందరికీ ఇది గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.. దేశంలోని వయోజన జనాభాలో 75 శాతానికి పైగా ఇప్పుడు… -
భారత్ కోవిడ్ అప్డేట్.. తాజా కేసులు ఎన్నంటే..?
భారత్లో కాస్త తగ్గుముఖం పట్టినా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. దేశవ్యాప్తంగా తాజాగా 2.34 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 2,34,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 893 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 3,52,784 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో… -
ఔను ..భారత్ పెగాసిస్ కొనుగోలు చేసింది!
క్షిపణి వ్యవస్థతో పాటు ఆయుధాల కొనుగోలుకు ఉద్దేశించిన రెండు వందలక కోట్ల డాలర్ల డిఫెన్స్ ప్యాకేజీలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ సంచలానత్మక కథనం ప్రచురించింది. ‘ ద బాటిల్ ఫర్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్ వెపన్’ పేరుతో ఈ కథనం వెలువడింది. దాంతో భారత్లో మరోసారి పెగాసిస్ అంశం ప్రధాన వార్తగా మారింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్… -
ఇండియన్స్కు గుడ్న్యూస్ చెప్పిన ఆ దేశం… ఇక నిబంధనలు లేవు..!
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాలు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. భారతీయులకు గుడ్న్యూస్ చెప్పింది కెనడా సర్కార్.. భారత్ నుంచి నేరుగానైనా లేదా గల్ఫ్/యూరప్/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది కెనడా.. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత కట్టడి చర్యల్లో భాగంగా చాలా దేశాలు ఆంక్షల బాటపట్టాయి.. ముఖ్యంగా విదేశీ ప్రయాణికుల విషయంలో కఠినంగా వ్యవహరించాయి.. ఇదే సమయంలో.. కెనడా కూడా ఆంక్షలు విధించి.. ఆ… -
భారత్లో భారీగా తగ్గిన కరోనా కేసులు… పెరిగిన మరణాలు…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,35,532 కరోనా కేసులు నమోదవ్వగా, 871 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా కేసులు తగ్గుతుంటే, మరణాలు పెరుగుతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. కరోనా కొత్త కేసుల కంటే రికవరీ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3,35,939 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 20,04,333 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. రోజుకవారీ కరోనా పాజిటివిటీ రేటు… -
దేశంలో పెరిగిపోతన్న సెకండ్ హ్యాండ్ మొబైల్ వ్యాపారం… ఒక్క ఏడాదిలో…
దేశంలో కరోనా మహమ్మారి తరువాత సెకండ్ హ్యాండ్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. సెకండ్ హ్యాండ్ కార్లకు ఏ విధంగా డిమాండ్ ఏర్పడిందో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల వ్యాపారం కూడా జోరుగా సాగుతున్నది. ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ లెక్కల ప్రకారం 2021లో 2.50 కోట్ల సెకండ్ హ్యాండ్ మొబైళ్లు ఇండియా మార్కెట్లో అమ్ముడయ్యాయి. దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 2019 నుంచి 21 వరకు సెకండ్ హ్యాండ్ మొబైళ్ల వ్యాపారంలో… -
ఫిలిప్పిన్స్కు బ్రహ్మోస్ క్షిపణులు…డీల్ విలువ ఎంతంటే…
ఇప్పటి వరకు ఇండియా రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలో దిగుమతుల్లో ఇండియా మూడో స్థానంలో ఉన్నది. అయితే, ఆత్మనిర్భర్లో భాగంగా ఇప్పుడు దేశంలో తయారైన ఆయుధాలను ఎగుమతి చేసేందుకు సిద్ధం అవుతున్నది. దేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పిన్స్కు ఎగుమతి చేసేందుకు ఒప్పదం కుదిరింది. ఈ ఒప్పందం విలువ 375 మిలియన్ డాలర్లు. ఫిలిప్పిన్స్ రక్షణశాఖ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఆదేశ రక్షణశాఖ వెబ్సైట్లో పేర్కొన్నది. త్వరలోనే ఇండియా బ్రహ్మోస్ క్షిపణులు ఫిలిప్పిన్స్కు ఎగుమతికానున్నాయి. క్షిపణులతో… -
కీలక పరిశోధన: ఆ దేశాల్లో మరణం కూడా ఒక సమస్యే…
మనిషి ఆయుప్రమాణం 60 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంది. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనిషి జీవించేందుకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. మరణించే సమయంలో కూడా ఎన్నో ఎదురుదెబ్బలు తిని మరణిస్తున్నారు. జీవించడం ఎంత ముఖ్యమో, మరణించే సమయంతో ప్రశాంతత కూడా అంతే ముఖ్యం. అమెరికాకు చెందని డ్యూక్ యూనివర్శిటీ క్వాలిటీ ఆప్ డెత్ అండ్ డైయింగ్ 2021 పేరిట పరిశోధనలు చేసి నివేదికను తయారు చేసింది. అధిక ఆదాయం కలిగిన దేశాల్లో మాత్రమే ప్రజలు… -
ఆరునెలలపాటు కరోనాతో పోరాడి విజయం సాధించిన భారతీయుడు…
కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నది. రోజువారీ కేసులు లక్షల్లోనమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు నమోదవుతున్నా తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా బారిన పడినప్పటికీ త్వరగా కోలుకుంటున్నారు. అయితే, యూఏఈలో పనిచేస్తున్న ఓ భారతీయ ఫ్రంట్లైన్ వర్కర్ ఆరు నెలల క్రితం కరోనా బారిన పడ్డాడు. అప్పటి నుంచి కరోనాతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆసుపత్రిలో గత ఆరునెలలుగా చికిత్స పొందుతూ ఎట్టకేలకు కోలుకున్నాడు. గురువారం రోజున ఆసుపత్రి…
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!