Iran War: భారత్ అంటే ఇది.. యుద్ధం వేళ హార్ముజ్ను దాటిన ఆయిల్ ట్యాంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. దీంతో ఇరాన్ చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. బుధవారం భారత్కు వస్తున్న కార్గో షిప్పై ఇరాన్ అటాక్ చేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇండియా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు ఫలించాయి. హార్ముజ్లో చిక్కుకున్న భారత ట్యాంకర్లకు ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది.
దీంతో, యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ దాటిన తొలి నౌకగా భారత నౌక చరిత్ర సృష్టించింది. లైబీరియన్ జెండా కలిగిన చమురు ట్యాంకర్ ముంబై ఓడరేవుకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఓడరేవులో ముడి చమురు లోడ్ను మోసుకెళ్తున్న ట్యాంకర్ షెన్లాంగ్ సూయెజ్మాక్స్ బుధవారం ఇరాన్ నౌకను ఇరుకైన జలమార్గం గుండా వెళ్ళడానికి అనుమతించిన తర్వాత ముంబైకి చేరుకుందని ముంబై పోర్ట్ ట్రస్ట్ తెలిపింది.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Monalisa: మాది లవ్ జిహాద్ కాదు..ప్రతి మతాన్ని సమానంగానే భావిస్తా!
రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఎస్ జైశకంకర్, అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటడానికి అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. బ్రవరి 28న టెహ్రాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక ప్రచారం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ జలసంధిని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ మార్గం మూసేయడంతో ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారుడైన భారత్ ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి వచ్చింది. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లు కూడా పెరిగాయి.
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. 28 భారతీయ జెండా కలిగిన నౌకలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్నాయని తెలిపింది. వీటిలో, 677 మంది భారతీయ నావికులతో కూడిన 24 నౌకలు హోర్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్నాయి, నాలుగు నౌకలు మరియు 101 మంది భారతీయ నావికులు జలసంధికి తూర్పున ఉన్నాయి. భారతీయ నౌకలు, నావికుల భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకుముందు, బుధవారం కాండ్లా ఓడరేవుకు వస్తున్న థాయ్ నౌకపై హార్ముజ్లో దాడి జరగింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్లో ఇప్పటి వరకు 16 నౌకలపై దాడి జరిగింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!