Iran War: భారత్ అంటే ఇది.. యుద్ధం వేళ హార్ముజ్ను దాటిన ఆయిల్ ట్యాంకర్..
Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. దీంతో ఇరాన్ చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. బుధవారం భారత్కు వస్తున్న కార్గో షిప్పై ఇరాన్ అటాక్ చేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇండియా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు ఫలించాయి. హార్ముజ్లో చిక్కుకున్న భారత ట్యాంకర్లకు ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది.
దీంతో, యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ దాటిన తొలి నౌకగా భారత నౌక చరిత్ర సృష్టించింది. లైబీరియన్ జెండా కలిగిన చమురు ట్యాంకర్ ముంబై ఓడరేవుకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఓడరేవులో ముడి చమురు లోడ్ను మోసుకెళ్తున్న ట్యాంకర్ షెన్లాంగ్ సూయెజ్మాక్స్ బుధవారం ఇరాన్ నౌకను ఇరుకైన జలమార్గం గుండా వెళ్ళడానికి అనుమతించిన తర్వాత ముంబైకి చేరుకుందని ముంబై పోర్ట్ ట్రస్ట్ తెలిపింది.
Also Read
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
Read Also: Monalisa: మాది లవ్ జిహాద్ కాదు..ప్రతి మతాన్ని సమానంగానే భావిస్తా!
రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఎస్ జైశకంకర్, అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటడానికి అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. బ్రవరి 28న టెహ్రాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక ప్రచారం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ జలసంధిని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ మార్గం మూసేయడంతో ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారుడైన భారత్ ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి వచ్చింది. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లు కూడా పెరిగాయి.
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. 28 భారతీయ జెండా కలిగిన నౌకలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్నాయని తెలిపింది. వీటిలో, 677 మంది భారతీయ నావికులతో కూడిన 24 నౌకలు హోర్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్నాయి, నాలుగు నౌకలు మరియు 101 మంది భారతీయ నావికులు జలసంధికి తూర్పున ఉన్నాయి. భారతీయ నౌకలు, నావికుల భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకుముందు, బుధవారం కాండ్లా ఓడరేవుకు వస్తున్న థాయ్ నౌకపై హార్ముజ్లో దాడి జరగింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్లో ఇప్పటి వరకు 16 నౌకలపై దాడి జరిగింది.
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?