దేశంలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశంలో 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో 17 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మహారాష్ట్రలోనే అధికంగా ఉంది. తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా ఇందులో మూడు కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. Read: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచలన వ్యాఖ్యలు… మాస్క్లు ధరించకుంటే… అయితే టాంజానియా నుంచి ముంబైలోని…
చమురు ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ కారణంగా కాలుష్యం పెరిగిపోతున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్, గ్యాస్ తో నడిచే వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాలు వాహనాలకు వినియోగించే బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి. అయితే, భవిష్యత్తులో హైడ్రోజన్తో నడిచే వాహనాలను, హైడ్రోజన్తో ఎలక్ట్రిసిటీని, హైడ్రోజన్ వంట గ్యాస్ను వినియోగించే రోజులు రాబోతున్నాయి. నీటినుంచి ఎలక్ట్రాలిసిస్ అనే ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ను వేరుచేస్తారు. ఈ హైడ్రోజన్ గ్యాస్ రూపంలో జనరేటర్లలో స్టోర్ చేసి కార్లకు…
సౌతాఫ్రికాలో వెలుగు చూసినా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచాన్నిచుట్టేసే పనిలోపడిపోయింది.. ఇప్పటికే భారత్లో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడగా.. తాజా, మరో రెండు కేసులు పాజిటివ్గా తేలాయి.. ఈ నెల 4వ తేదీన జింబాబ్వే నుంచి గుజరాత్లోని జామ్నగర్కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారించారు.. ఇక, అప్రమత్తమైన అధికారులు.. అతడు కలిసినవారిని ట్రేస్ చేశారు.. వారి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా…
అంతర్జాతీయ వన్డేలకు కెప్టెన్గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ నియమించడంతో కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా టీమిండియా మిగతా వాళ్ల సారథ్యంలో కంటే కోహ్లీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్లు గెలిచిందని పలువురు అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జనరల్ సెక్రటరీ షా ఇద్దరూ కలిసి కుట్ర పన్నారంటూ కోహ్లీ…
చిన్న తరహా కార్లకు ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది. పదిలక్షల లోపు ధర ఉన్న కార్లు దేశంలో అధికంగా అమ్ముడవుతుంటాయి. ఇలాంటి వాటిల్లో మారుతీ సుజుకీ బాలినో కూడా ఒకటి. బాలినో కార్లను 2015లో ఇండియాలో రిలీజ్ చేశారు. ఇండియన్ రోడ్లకు అనుగుణంగా తయారైన ఈ కార్లకు డిమాండ్ ఉన్నది. 2015 అక్టోబర్ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ కార్లు 2018 వరకు మూడేళ్ల కాలంలో 5 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. Read: వింత సంప్రదాయం: అప్పటి…
వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ… పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి,భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు చేసింది. కనీస మద్దతు ధర (ఎంఎస్పి) పై స్వయంగా ప్రధానమంత్రి, తరువాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు. రైతు ప్రతినిధుల్లో ఎస్కేఎంల ప్రతినిధులను కూడా చేర్చుకుంటామని స్పష్టం చేసింది. అలాగే దేశంలోని రైతులకు ఎంఎస్పి ఇవ్వాలన్నది కమిటీ…
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ట్వీట్ ఇండియాలో ఓ రికార్డు సాధించింది. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్ లు కరోనా కారణంగా లాక్ డౌన్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ మొదటి భాగం మన ఇండియాలో జరుగుతున్న సమయంలో ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఐపీఎల్ లో కోల్కతా నైట్రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్ కమ్మిన్స్ ఈ కరోనాను ఎదిరించి పోరాడటానికి $50,000 ప్రధాని కేర్స్ ఫండ్…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని… తీవ్ర లక్షలు కలిగిస్తుందనే ఆధారాలు లేవంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ ఓ. అందువల్ల ఒమిక్రాన్ వేరియంట్ గురించి అర్థం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వ్యాక్సీన్ తీసుకున్న వాళ్లకు సైతం ఒమిక్రాన్ సోకుతున్నా… రోగులకు రక్షణ కొనసాగుతుందని తెలిపింది. అన్ని రకాల వేరియంట్లపై వ్యాక్సీన్లు సమర్థవంతంగా పనిచేశాయని ఇప్పటికే రుజువైందని వివరించింది. కాగా.. మన ఇండియా లో కూడా ఈ కొత్త వేరియంట్ వ్యాపించిన…
సీడీఎస్ బిపిన్ రావత్ మరణం యావత్ దేశానికే తీరని లోటని మాజీ కేంద్ర రక్షణ సహాయశాఖ మంత్రి పల్లం రాజు అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. బిపిన్ రావత్ మరణం పై స్పందించారు. నాకు సీడీఎస్ రావత్తో మంచి అనుబంధం ఉంది. త్రివిధ దళాల అధిపతిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నో పతకాలు సాధించారన్నారు. చాపర్ ప్రమాదం పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయని, కానీ దర్యాప్తులోనే నిజాలు తెలుస్తాయని ఆయన అన్నారు. విజబులిటి సరిగా…