సీడీఎస్ బిపిన్ రావత్ మరణం యావత్ దేశానికే తీరని లోటని మాజీ కేంద్ర రక్షణ సహాయశాఖ మంత్రి పల్లం రాజు అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. బిపిన్ రావత్ మరణం పై స్పందించారు. నాకు సీడీఎస్ రావత్తో మంచి అనుబంధం ఉంది. త్రివిధ దళాల అధిపతిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నో పతకాలు సాధించారన్నారు. చాపర్ ప్రమాదం పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయని, కానీ దర్యాప్తులోనే నిజాలు తెలుస్తాయని ఆయన అన్నారు. విజబులిటి సరిగా లేకనే చాపర్ క్రాష్ అయి ఉంటుందని పల్లం రాజు అభిప్రాయ పడ్డారు. వీఐపీల ప్రయాణంలో కొన్నిజాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
పరిస్థితులు అనుకూలించనప్పుడు కునూర్ నుంచి వెల్లింగ్టన్కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటే బాగుండేదన్నారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉండేదని ఆయన అన్నారు. రక్షణశాఖలో ప్రైవేట్ భాగస్వామ్యం కొంతమేరకు అవసరం అయినప్పటికీ నాణ్యత, ప్రమాణాల విషయంలో రాజీపడొద్దని పల్లం రాజు అన్నారు. బిపిన్ రావత్ మరణం దేశానికి ఎంతో నష్టం కలిగించిందని ఆయన అన్నారు. వీఐపీలు ప్రయాణాలు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలని పల్లం రాజు సలహా ఇచ్చారు.