Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Naidu Announces Annadata Sukhibhava Scheme 3rd Installment For Farmers Tomorrow

CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో అకౌంట్స్ లోకి “అన్నదాత సుఖీభవ స్కీం” డబ్బులు జమా..!

Published Date :March 12, 2026 , 3:44 pm
By Kothuru Ram Kumar
CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో అకౌంట్స్ లోకి “అన్నదాత సుఖీభవ స్కీం” డబ్బులు జమా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు వాటి లబ్ధి సక్రమంగా చేరే విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 6వ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్సులో పలు కీలక అంశాలపై ఆయన అధికారులకు సూచనలు చేశారు.

సూపర్ 6 పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందించాలని ఆయన సూచించారు. ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వం నుంచి ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి అందిందో తెలియేలా ఈ లేఖలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

ప్రతి కుటుంబానికి ఏ పథకం ద్వారా ఎంత ప్రయోజనం అందిందో స్పష్టంగా తెలియజేస్తే వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అందించే పెన్షన్, ఉచిత సిలిండర్, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల వివరాలు లబ్ధిదారులకు స్పష్టంగా చేరాలని అన్నారు. డీబీటీ పథకాల అమలులో సాంకేతికతను వినియోగించాలని సీఎం సూచించారు. ముఖ్యంగా దీపం 2.0 స్కీం పథకానికి డిజిటల్ వోచర్లు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. అలాగే డీబీటీ పథకాలలో ప్రోగ్రామబుల్ వోచర్లు ఇస్తే లబ్ధిదారులు వాటిని అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోగలరని తెలిపారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కూడా సీఎం వివరాలు వెల్లడించారు. మార్చి 9 నాటికి మహిళలు మొత్తం 50.45 కోట్ల ప్రయాణాలు చేసినట్లు తెలిపారు. ఇందుకు గాను ప్రభుత్వం APSRTCకు రూ.1775 కోట్లను రీయింబర్స్ చేసినట్లు తెక్కిపారు. పేదరిక నిర్మూలన దిశగా డ్వాక్రా, మెప్మా సంఘాల సేవలను వినియోగించి పీ4 సహా జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇంకా కుటుంబ సాధికారిత, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ప్రభుత్వ లక్ష్యమని.. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి త్వరలో ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి “అన్నదాత సుఖీభవ స్కీం” పథకం కింద రేపు మూడో విడత నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే “అన్న కాంటీన్స్” ద్వారా ఇప్పటివరకు పేదలకు 7.5 కోట్ల భోజనాలు అందించినట్లు చెప్పారు. సామాజిక రంగంలో కూడా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ అమలు చేస్తుమన్నారు. ఇంకా రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో “పల్లె పండుగ ప్రోగ్రాం” కింద రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.

Revanth Reddy : హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే, హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే

సంక్షేమ పథకాల లాస్ట్ మైల్ డెలివరీ లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలని సీఎం ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకం ఉండేలా జిల్లా పరిపాలన నడపాలని సూచించారు. ఇళ్ల సమస్య పరిష్కారంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉగాది పండుగ సందర్భంగా 2.5 లక్షల మందికి సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇంకా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా సీఎం దృష్టి పెట్టారు. ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి కుళాయి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా పని చేస్తున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామాల్లో సాలిడ్, లిక్విడ్ వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. ఘన వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు తరలించడం, తడి వ్యర్థాలతో కంపోస్ట్ తయారీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే 500 పాఠశాలల్లో నెట్ జీరో కాన్సెప్ట్‌తో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

Monalisa: “మోనాలిసా” చనిపోతానని బెదిరించింది, అందుకే పెళ్లి చేసుకున్నాం

కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్ జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.9773 కోట్లు కేటాయించిందని సీఎం వెల్లడించారు. ఈ పథకం డిమాండ్ డ్రివెన్ కాకపోవడంతో అందుకు అనుగుణంగా దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇంకా పెట్టుబడుల గురించి ఎంతగా ఆలోచిస్తున్నామో.. పేదలకు అందించే సంక్షేమం, వారికి కల్పించే సాధికారత గురించి కూడా అదే స్థాయిలో ఆలోచించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh welfare schemes
  • Annadata Sukhibhava Scheme
  • Annadata Sukhibhava third installment
  • AP farmers benefits
  • AP farmers financial assistance

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions