ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… కాస్త తగ్గాయి కరోనా కేసులు. గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,774 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. మరో 306 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.
దీంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 475434 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 92,281 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 132.9 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇక దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 34122795 మంది పూర్తిగా కోలుకున్నారు.