LPG Crisis: గ్యాస్, పెట్రోల్ కొరతపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన..
- దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదు..
- పార్లమెంట్లో కేంద్రమంత్రి ప్రకటన..
- గృహ వినియోగదారులకే తొలి ప్రాధాన్యం..
- గ్యాస్ బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..
LPG Crisis: ఇరాన్ యుద్ధం కారణంగా, దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభంపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేశారు. గృహ వినియోగదారులకు ఎలాంటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కమర్షియల్ గ్యాస్ను బ్లాక్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ముందుగా సాధారణ ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. స్కూల్స్, హాస్పిటల్స్కు ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే చమురు విషయంలో భారత్ స్థానం పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు.
Read Also: Sprouts Chilla Recipe: బ్రేక్ఫాస్ట్లో “మొలకల చిల్లా” చేసుకోండి.. రుచితో పాటు ఆరోగ్యం..
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
గల్ఫ్ దేశాల నుంచి 60 శాతం ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నామని, దేశంలో డిజిల్, పెట్రోల్ కొరత లేదని చెప్పారు .గల్ఫ్ దేశాలకు బదులుగా నార్వే, కెనడా నుంచి దిగుమతి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలోని అన్ని రిఫైనరీలు అధిక సామర్థ్యంలో పని చేస్తున్నాయని చెప్పారు. హార్ముజ్ జలసంధి నుంచి కాకుండా వేరే ప్రాంతాల నుంచి ముడి చమురు దిగుమతులు దాదాపుగా 70 శాతానికి పెరిగాయని వెల్లడించారు. భారతదేశం చమురు అవసరాల కోసం 2006-07లో 27 దేశాలపై ఆధారపడితే, ఇప్పుడు ఇది 40 దేశాలకు పెరిగిందని కేంద్రమంత్రి చెప్పారు.
ఆధునిక ఇంధన చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని, భారతదేశ ముడి చమురు స్థానం సురక్షితంగా ఉందని, సంక్షోభానికి ముందు భారత ముడి చమురు దిగుమతుల్లో 45 శాతం మాత్రమే హార్ముజ్ ద్వారా రవాణా జరిగిందని, సంక్షోభ సమయంలో కూడా ప్రధాని మోడీ దౌత్యం వల్ల భారతదేశానికి హర్ముజ్ జలసంధిని ఇరాన్ అనుమతించిందని సభలో తెలిపారు.
#WATCH | Delhi: In the Lok Sabha, Union Minister for Petroleum and Natural Gas, Hardeep Singh Puri, says, "The refineries are operating at high capacity utilisation. In several cases, they are exceeding 100%. There is no shortage of petrol, diesel, kerosene, ATF or fuel oil. The… pic.twitter.com/bqZWqcDf8G
— ANI (@ANI) March 12, 2026
తాజావార్తలు
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?