ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. తబ్లిగీ జమాత్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ వారిపై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇస్లామిక్ మతాన్ని కాపాడటమే ధ్యేయమంటూ వ్యాఖ్యలు చేసే ఈ సంస్థపై సౌదీ అరేబియా నిషేధం విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 1926లో తబ్లిగీ జమాత్ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో సుమారు 35 కోట్ల ముస్లింలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ముస్లింలకు చెందిన సంస్థను ఇతర దేశాల్లో నిషేధం విధిస్తే గందరగోళం సృష్టించేవారు… కానీ ఇప్పుడు ఏకంగా ఓ ఇస్లామిక్ దేశమే వీరిపై నిషేధం విధించడంతో ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అంతేకాకుండా భారత్ కూడా దీనిపై తబ్లిగీ జమాత్ సంస్థపై దృష్టి సారించాలని సౌదీ అరేబియా అనడం కొసమెరుపు