యోగా అనేది ఆరోగ్యకరమైన జీవనం కోసం భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన బహుమతి. దీనిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మెరుగైన జీవన నాణ్యత కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
India Fuel Demand: భారతదేశ ఇంధన డిమాండ్ 24 ఏళ్ల గరిష్టస్థాయికి చేరుకుంది. డిమాండ్ కు తగినట్లుగా ఫిబ్రవరిలో రోజుకు 5 శాతం కంటే ఎక్కువగా ఇంధన వినియోగం పెరిగి రోజుకు 4.82 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇది వరసగా 15వ సంవత్సరం పెరుగుదలను సూచిస్తోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) డేటా.. భారత ఇంధన డిమాండ్ 24 ఏళ్ల గరిష్టమని పేర్కొంది.
Influenza A(H3N2) Cases: దేశవ్యాప్తంగా సీజనల్ ఇన్ఫ్లూయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ వేగంగా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ లక్షణాలతో ఈ వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీర్ఘకాలిక దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ కారణంగా దేశంలో 2 మరణాలు సంభవించాయి. ‘‘హాంకాంగ్ ఫ్లూ’’గా పిలిచే హెచ్3ఎన్2 వైరస్ వల్ల దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ను ఆసీస్ టీం ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాని నిలబెడుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు.
న్యూజిలాండ్లో న్యూజిలాండ్ జట్టును ఓడించే సత్తా శ్రీలంకకు లేదని మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ అన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ కోసం ఇండియా, శ్రీలంక మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో సంజయ్ ముంజ్రేకర్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.
US Intelligence Report: అమెరికా ఇంటెలిజెన్స్ భారత్, పాక్ సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా ఇంటెలిజెన్స్ ఆన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం.. పాకిస్తాన్ ఏదైనా కవ్వింపుచర్యలకు పాల్పడితే సైనికంగా ప్రతిస్పందించేందుకు భారతదేశం గతం కన్నా ఎక్కువ అవకాశం ఉందని వెల్లడించింది.
భూమిపై పరిశీలనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత్ రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నిసార్’ ఉపగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమైంది.