RSS chief Mohan Bhagwat: పాక్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.. విభజన పొరపాటుగా జరిగింది..
RSS chief Mohan Bhagwat: ఏడు దశాబ్దాలకు పైగా స్వాతంత్య్రం పొందిన తరువాత పాకిస్తాన్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, విభజన పొరపాటుగా జరిగిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం అన్నారు. భారత్కు వచ్చిన వారు సంతోషంగా ఉన్నారని, అయితే పాకిస్థాన్లో ఉన్నవారు సంతోషంగా లేరని భగవత్ అన్నారు. యువ విప్లవకారుడు హేము కలానీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సింధీలు పాల్గొన్నారు.
“ఈ రోజు, పాకిస్తాన్ ప్రజలు భారత విభజన పొరపాటు అని అంటున్నారు, భారతదేశం నుంచి విడిపోయిన వారు ఇంకా సంతోషంగా ఉన్నారా? భారతదేశానికి వచ్చిన వారు ఈ రోజు సంతోషంగా ఉన్నారు, కాని అక్కడ ఉన్నవారు (పాక్లో) సంతోషంగా లేరు” అని మోహన్ భగవత్ చెప్పారు. 1947లో మొండితనం కారణంగా భారత్ నుంచి విడిపోయిన వారు ఇప్పటికీ సంతోషంగా ఉన్నారా? అక్కడ బాధ ఉందని మోహన్ భగవత్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ పాకిస్థాన్ను ప్రస్తావిస్తూ.. భారత్లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అఖండ భారత్ నిజమేనని, అయితే విభజించబడిన భారత్ ‘పీడకల’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. నవ భారతాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు.”అఖండ భారత్ (ప్రస్తుతం ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్లలో ఉన్న అన్ని పురాతన భాగాలతో కూడిన దేశం) నిజం అయితే విభజించబడిన భారతదేశం ఒక పీడకల” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Read Also: Acting For Pension: పెన్షన్ కోసం అంధురాలిగా నాటకం.. ఏకంగా 15 ఏళ్ల పాటు.. కానీ చివరికి..
భారత్, పాకిస్తాన్ మధ్య చేదు సంబంధాలను ప్రస్తావిస్తూ, ఇతరులపై దాడులకు పిలుపునిచ్చే సంస్కృతికి భారతదేశం చెందినది కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.”భారత్ పాకిస్థాన్పై దాడి చేయాలని నా ఉద్దేశ్యం కాదు. అస్సలు కాదు. ఇతరులపై దాడికి పిలుపునిచ్చే సంస్కృతికి మేము చెందము” అని ఆయన అన్నారు. “మేము ఆత్మరక్షణలో తగిన సమాధానం చెప్పే సంస్కృతి నుంచి వచ్చాము,” భగవత్ ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రస్తావిస్తూ, “మేము దీన్ని చేస్తాము, మేము చేస్తూనే ఉంటాము” అని జోడించాడు. భారత్ను విభజించడాన్ని పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు తప్పుగా చెబుతున్నారు. అందరూ తప్పుగా చెబుతున్నారని మోహన్ భగవత్ నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో