RSS chief Mohan Bhagwat: పాక్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.. విభజన పొరపాటుగా జరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS chief Mohan Bhagwat: ఏడు దశాబ్దాలకు పైగా స్వాతంత్య్రం పొందిన తరువాత పాకిస్తాన్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, విభజన పొరపాటుగా జరిగిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం అన్నారు. భారత్కు వచ్చిన వారు సంతోషంగా ఉన్నారని, అయితే పాకిస్థాన్లో ఉన్నవారు సంతోషంగా లేరని భగవత్ అన్నారు. యువ విప్లవకారుడు హేము కలానీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సింధీలు పాల్గొన్నారు.
“ఈ రోజు, పాకిస్తాన్ ప్రజలు భారత విభజన పొరపాటు అని అంటున్నారు, భారతదేశం నుంచి విడిపోయిన వారు ఇంకా సంతోషంగా ఉన్నారా? భారతదేశానికి వచ్చిన వారు ఈ రోజు సంతోషంగా ఉన్నారు, కాని అక్కడ ఉన్నవారు (పాక్లో) సంతోషంగా లేరు” అని మోహన్ భగవత్ చెప్పారు. 1947లో మొండితనం కారణంగా భారత్ నుంచి విడిపోయిన వారు ఇప్పటికీ సంతోషంగా ఉన్నారా? అక్కడ బాధ ఉందని మోహన్ భగవత్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ పాకిస్థాన్ను ప్రస్తావిస్తూ.. భారత్లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అఖండ భారత్ నిజమేనని, అయితే విభజించబడిన భారత్ ‘పీడకల’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. నవ భారతాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు.”అఖండ భారత్ (ప్రస్తుతం ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్లలో ఉన్న అన్ని పురాతన భాగాలతో కూడిన దేశం) నిజం అయితే విభజించబడిన భారతదేశం ఒక పీడకల” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
Read Also: Acting For Pension: పెన్షన్ కోసం అంధురాలిగా నాటకం.. ఏకంగా 15 ఏళ్ల పాటు.. కానీ చివరికి..
భారత్, పాకిస్తాన్ మధ్య చేదు సంబంధాలను ప్రస్తావిస్తూ, ఇతరులపై దాడులకు పిలుపునిచ్చే సంస్కృతికి భారతదేశం చెందినది కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.”భారత్ పాకిస్థాన్పై దాడి చేయాలని నా ఉద్దేశ్యం కాదు. అస్సలు కాదు. ఇతరులపై దాడికి పిలుపునిచ్చే సంస్కృతికి మేము చెందము” అని ఆయన అన్నారు. “మేము ఆత్మరక్షణలో తగిన సమాధానం చెప్పే సంస్కృతి నుంచి వచ్చాము,” భగవత్ ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రస్తావిస్తూ, “మేము దీన్ని చేస్తాము, మేము చేస్తూనే ఉంటాము” అని జోడించాడు. భారత్ను విభజించడాన్ని పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు తప్పుగా చెబుతున్నారు. అందరూ తప్పుగా చెబుతున్నారని మోహన్ భగవత్ నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!