RSS chief Mohan Bhagwat: పాక్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.. విభజన పొరపాటుగా జరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS chief Mohan Bhagwat: ఏడు దశాబ్దాలకు పైగా స్వాతంత్య్రం పొందిన తరువాత పాకిస్తాన్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, విభజన పొరపాటుగా జరిగిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం అన్నారు. భారత్కు వచ్చిన వారు సంతోషంగా ఉన్నారని, అయితే పాకిస్థాన్లో ఉన్నవారు సంతోషంగా లేరని భగవత్ అన్నారు. యువ విప్లవకారుడు హేము కలానీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సింధీలు పాల్గొన్నారు.
“ఈ రోజు, పాకిస్తాన్ ప్రజలు భారత విభజన పొరపాటు అని అంటున్నారు, భారతదేశం నుంచి విడిపోయిన వారు ఇంకా సంతోషంగా ఉన్నారా? భారతదేశానికి వచ్చిన వారు ఈ రోజు సంతోషంగా ఉన్నారు, కాని అక్కడ ఉన్నవారు (పాక్లో) సంతోషంగా లేరు” అని మోహన్ భగవత్ చెప్పారు. 1947లో మొండితనం కారణంగా భారత్ నుంచి విడిపోయిన వారు ఇప్పటికీ సంతోషంగా ఉన్నారా? అక్కడ బాధ ఉందని మోహన్ భగవత్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ పాకిస్థాన్ను ప్రస్తావిస్తూ.. భారత్లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అఖండ భారత్ నిజమేనని, అయితే విభజించబడిన భారత్ ‘పీడకల’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. నవ భారతాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు.”అఖండ భారత్ (ప్రస్తుతం ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్లలో ఉన్న అన్ని పురాతన భాగాలతో కూడిన దేశం) నిజం అయితే విభజించబడిన భారతదేశం ఒక పీడకల” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
Read Also: Acting For Pension: పెన్షన్ కోసం అంధురాలిగా నాటకం.. ఏకంగా 15 ఏళ్ల పాటు.. కానీ చివరికి..
భారత్, పాకిస్తాన్ మధ్య చేదు సంబంధాలను ప్రస్తావిస్తూ, ఇతరులపై దాడులకు పిలుపునిచ్చే సంస్కృతికి భారతదేశం చెందినది కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.”భారత్ పాకిస్థాన్పై దాడి చేయాలని నా ఉద్దేశ్యం కాదు. అస్సలు కాదు. ఇతరులపై దాడికి పిలుపునిచ్చే సంస్కృతికి మేము చెందము” అని ఆయన అన్నారు. “మేము ఆత్మరక్షణలో తగిన సమాధానం చెప్పే సంస్కృతి నుంచి వచ్చాము,” భగవత్ ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రస్తావిస్తూ, “మేము దీన్ని చేస్తాము, మేము చేస్తూనే ఉంటాము” అని జోడించాడు. భారత్ను విభజించడాన్ని పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు తప్పుగా చెబుతున్నారు. అందరూ తప్పుగా చెబుతున్నారని మోహన్ భగవత్ నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!