Rajya Sabha Elections: పోటీ లేకుండానే విక్టరీ.. రాజ్యసభ ఎన్నికల్లో 26 స్థానాలు ఏకగ్రీవం.. మూడు రాష్ట్రాల్లో మాత్రం!
Rajya Sabha Elections: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన వారిలో శరద్ పవార్ (NCP), రాందాస్ అథవాలే, అభిషేక్ మను సింఘ్వి, తంబి దురై, వినోద్ తవ్డే, బాబుల్ సుప్రియో వంటి దిగ్గజ నేతలు ఉన్నారు. అయితే, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో మాత్రం అభ్యర్థులు బరిలో ఉండటంతో పోలింగ్ అనివార్యమైంది.
READ ALSO: UAE: యుఏఈలో 35 మంది అరెస్టుకు ఆదేశం.. మెజారిటీ భారతీయులే!
Also Read
- Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
- Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్ఫోలియోలో రూ.20 లక్షలు..
- Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్రావుకు హైకోర్టులో ఊరట
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
బీహార్: కుష్వాహా వర్సెస్ ఏడీ సింగ్
బీహార్లో ఐదు స్థానాలకు గాను నితీష్ కుమార్, రామ్నాథ్ ఠాకూర్ (JDU), నితిన్ నబిన్, శివం కుమార్ (BJP) విజయం ఖాయమైంది. అయితే, ఐదో సీటు కోసం ఎన్డీయే అభ్యర్థి ఉపేంద్ర కుష్వాహా, మహాఘటబంధన్ అభ్యర్థి ఏడీ సింగ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ సీటును గెలవడానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం విపక్ష కూటమికి 35 మంది ఉన్నారు. తేజస్వి యాదవ్కు మద్దతుగా AIMIM ఎమ్మెల్యేలు నిలవడంతో పోరు ఆసక్తికరంగా మారింది.
ఒడిశా: క్రాస్ ఓటింగ్పైనే ఆశలు!
ఒడిశాలో ఒక సీటు గెలవడానికి 30 ఓట్లు అవసరం. ఇక్కడ బీజేపీకి ఇద్దరు, బీజేడీకి ఒక అభ్యర్థి విజయం సులభమే. కానీ, బీజేపీ మద్దతుతో బరిలో ఉన్న దిలీప్ రే గెలవాలంటే మరో 8 ఓట్లు అదనంగా కావాలి. కాంగ్రెస్, బీజేడీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే నమ్మకంతో బీజేపీ వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, సీపీఎం కలిసి 33 ఓట్లతో ఒక స్థానాన్ని గెలుచుకునే స్థితిలో ఉన్నాయి.
హర్యానా: క్యాంప్ రాజకీయాలు షురూ!
హర్యానాలో బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా, కాంగ్రెస్ అభ్యర్థి కరంవీర్ బోధ్ గెలుపు దాదాపు ఖాయం. కానీ, స్వతంత్ర అభ్యర్థి సతీష్ నందల్ రంగంలోకి దిగడంతో సమీకరణాలు మారాయి. క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయంతో కాంగ్రెస్ తన 31 మంది ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్కు తరలించింది. అయితే, భూపిందర్ సింగ్ హుడా, వినేష్ ఫోగట్ సహా ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ క్యాంప్కు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నేడు (సోమవారం) జరగనున్న పోలింగ్లో ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు ఎవరిని వరిస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది. క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు తలకిందులయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
-
PSL 2026: పాకిస్థాన్కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్ తొలగింపు
-
Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్ఫోలియోలో రూ.20 లక్షలు..
-
Adivi Sesh: “నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?” అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
-
Idiyappam Recipe: హోటల్ స్టైల్ సాఫ్ట్ ‘ఇడియప్పం’ ఇంట్లోనే.. వేడినీళ్ల మ్యాజిక్తో సులభంగా ఇలా చేసేయండి.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!