Expensive Apartment : భారత్ లోనే ఖరీదైన అపార్ట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్ దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ లో జరిగింది. సముద్రానికి ఎదురుగా ఉండే విలాసవంతమైన ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్ ను లోధా గ్రూప్ నుంచి రూ. 396 కోట్లతో ఫెమీ కేర్ వ్యవస్థాపకుడు జేపీ తపారియా కొన్నారు. ఈ సూపర్ లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ లోధా మలబార్ హిల్ యొక్క విలాసవంతమై 26,27,28 అంతస్తులలో ఉంది. 27 160చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బంగలా విస్తరించి ఉంది. ఇందులో ఒక్కో చదరపు అడుగుకు రూ. 1.36 లక్షల రేటు చొప్పున ఈ డీల్ జరిగింది. దీంతో ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.
Also Read : IPL 2023 : క్రికెట్ అభిమానులకు డబుల్ మజా
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
ఇక గతంలో.. ఈ ఏడాదిలోనే ఫిబ్రవరిలో డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ కుటుంబ సభ్యులు ముంబైలోనే రూ. 1,238 కోట్ల విలువైన 28 హౌసింగ్ యూనిట్లను కొనుగొలు చేశారు. ఇది బహుశా భారతదేశంలో అతిపెద్ద ఆస్తి ఒప్పందం. అదే నెలలో, రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్జీస్ లిమిటెడ్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను అభివృద్ది చేయడానికి చెంబూర్ లోని రాజ్ కపూర్ బంగ్లాను కొనుగోలు చేసింది. గత వారం రియాల్టీ మేుజర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ కూడా గురుగ్రామ్ లోని తన హౌసింగ్ ప్రాజెక్ట్ లో రూ. 7 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ ధర ఉన్న 1,137 లగ్జరీ అపార్ట్మెంట్ లను 3 రోజుల్లో రూ. 8000 కోట్లకు విక్రయించినట్లు ప్రకటించింది.
Also Read : TSRTC: ఆర్టీసీ ప్రయాణికులపై భారం.. బస్సుల్లో పెరిగిన టికెట్ ధరలు
దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన ప్రాపర్టీ మార్కెట్ ముంబై మార్చి నెలలో రికార్డ్ స్టాపం డ్యూటీ సేకరణతో కొత్త శిఖరానికి చేరుకుంది. దీని కారణంగా లగ్జరీ ప్రాపర్టీల అమ్మకం గణనీయంగా పెరిగింది. ఎందుకంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెట్టుబడిపై మూలధన లాభాల నుంచి మినహాయింపు ఏప్రిల్ నుంచి రూ. 10 కోట్లకు పరిమితం చేయనుంది. 2023-2024 యూనియన్ బడ్జెట్ లో.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి హౌసింగ్ ప్రాపర్టీలో పెట్టబుడిపై మూలధన లాభాల నుంచి తగ్గింపుపై పరిమితిని ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ ఛార్జీలు, రెడీ రికనర్ రేట్లలో ఏదైనా పెంపుదలకు ముందే ఇతర సెగ్మెంట్ లలోని గృహ కొనుగోలుదారులు తమ డీల్ లను ముగించాలనే హడావిడి కూడా 2022-23లో రిజిస్ట్రేషన్ ను గరిష్టం స్థాయికి నెట్టివేసింది.
Also Read : Hinduism to Islam: మత మార్పిడి చేసినట్లు ఆరోపణలు.. ఏడుగురిపై కేసు నమోదు
మహారాష్ట్ర బడ్జెట్ ఆదాయం మార్చిలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. దేశ వాణిజ్య రాజధానిలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరిలో 13,002 డీల్స్ తో 34శాతం పెరిగాయి. స్టాప్ం డ్యూటీ వసూళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం 8శాతం పెరిగి. 1,203 కోట్లకు చేరుకుంది. డీల్ ల పరిమాణం పెరిగింది. పన్ను సంబంధిత కారకాలు స్టాంప్ డ్యూటీ ఆదాయంలో పెరుగుదలకి దారితీశాయి. విభాగాల్లో డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ, సరసమైన, మధ్య ఆదాయ గృహాలకు అధిక వడ్డీ రేట్లు హానికరం అని రుజువు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!