Expensive Apartment : భారత్ లోనే ఖరీదైన అపార్ట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్ దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ లో జరిగింది. సముద్రానికి ఎదురుగా ఉండే విలాసవంతమైన ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్ ను లోధా గ్రూప్ నుంచి రూ. 396 కోట్లతో ఫెమీ కేర్ వ్యవస్థాపకుడు జేపీ తపారియా కొన్నారు. ఈ సూపర్ లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ లోధా మలబార్ హిల్ యొక్క విలాసవంతమై 26,27,28 అంతస్తులలో ఉంది. 27 160చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బంగలా విస్తరించి ఉంది. ఇందులో ఒక్కో చదరపు అడుగుకు రూ. 1.36 లక్షల రేటు చొప్పున ఈ డీల్ జరిగింది. దీంతో ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.
Also Read : IPL 2023 : క్రికెట్ అభిమానులకు డబుల్ మజా
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇక గతంలో.. ఈ ఏడాదిలోనే ఫిబ్రవరిలో డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ కుటుంబ సభ్యులు ముంబైలోనే రూ. 1,238 కోట్ల విలువైన 28 హౌసింగ్ యూనిట్లను కొనుగొలు చేశారు. ఇది బహుశా భారతదేశంలో అతిపెద్ద ఆస్తి ఒప్పందం. అదే నెలలో, రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్జీస్ లిమిటెడ్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను అభివృద్ది చేయడానికి చెంబూర్ లోని రాజ్ కపూర్ బంగ్లాను కొనుగోలు చేసింది. గత వారం రియాల్టీ మేుజర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ కూడా గురుగ్రామ్ లోని తన హౌసింగ్ ప్రాజెక్ట్ లో రూ. 7 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ ధర ఉన్న 1,137 లగ్జరీ అపార్ట్మెంట్ లను 3 రోజుల్లో రూ. 8000 కోట్లకు విక్రయించినట్లు ప్రకటించింది.
Also Read : TSRTC: ఆర్టీసీ ప్రయాణికులపై భారం.. బస్సుల్లో పెరిగిన టికెట్ ధరలు
దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన ప్రాపర్టీ మార్కెట్ ముంబై మార్చి నెలలో రికార్డ్ స్టాపం డ్యూటీ సేకరణతో కొత్త శిఖరానికి చేరుకుంది. దీని కారణంగా లగ్జరీ ప్రాపర్టీల అమ్మకం గణనీయంగా పెరిగింది. ఎందుకంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెట్టుబడిపై మూలధన లాభాల నుంచి మినహాయింపు ఏప్రిల్ నుంచి రూ. 10 కోట్లకు పరిమితం చేయనుంది. 2023-2024 యూనియన్ బడ్జెట్ లో.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి హౌసింగ్ ప్రాపర్టీలో పెట్టబుడిపై మూలధన లాభాల నుంచి తగ్గింపుపై పరిమితిని ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ ఛార్జీలు, రెడీ రికనర్ రేట్లలో ఏదైనా పెంపుదలకు ముందే ఇతర సెగ్మెంట్ లలోని గృహ కొనుగోలుదారులు తమ డీల్ లను ముగించాలనే హడావిడి కూడా 2022-23లో రిజిస్ట్రేషన్ ను గరిష్టం స్థాయికి నెట్టివేసింది.
Also Read : Hinduism to Islam: మత మార్పిడి చేసినట్లు ఆరోపణలు.. ఏడుగురిపై కేసు నమోదు
మహారాష్ట్ర బడ్జెట్ ఆదాయం మార్చిలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. దేశ వాణిజ్య రాజధానిలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరిలో 13,002 డీల్స్ తో 34శాతం పెరిగాయి. స్టాప్ం డ్యూటీ వసూళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం 8శాతం పెరిగి. 1,203 కోట్లకు చేరుకుంది. డీల్ ల పరిమాణం పెరిగింది. పన్ను సంబంధిత కారకాలు స్టాంప్ డ్యూటీ ఆదాయంలో పెరుగుదలకి దారితీశాయి. విభాగాల్లో డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ, సరసమైన, మధ్య ఆదాయ గృహాలకు అధిక వడ్డీ రేట్లు హానికరం అని రుజువు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!