26/11 Mumbai Attack: ముంబై దాడి సూత్రధారులు “భారీ మూల్యం” చెల్లించాల్సిందే.. ఇజ్రాయిల్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 Mumbai Attack: 26/11 ముంబయి దాడికి ప్లాన్ చేసినవారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అని ఇజ్రాయిల్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు. తొలిసారిగా భారత్ పర్యటకు వచ్చిన అమీర్ ఓహానా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ముంబై దాడికి ప్లాన్ చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాది ఎవరైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. భారత్, ఇజ్రాయిల్ రెండు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ముందుకు రావాలని ఆయన అన్నారు.
Read Also: World Idli Day: ఇడ్లీనా మజాకా.. గతేడాది 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీల డెలివరీ..
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు అత్యంత సన్నిహితుడిగా అమీర్ ఓహానా ఉన్నారు. గత ఏడాది పదవి స్వీకరించిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటన కోసం భారత్ వచ్చారు. 2008 ముంబై అటాక్స్ లో 207 మంది మరణించారు. ఇందులో 178 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు యూదులను, ఇజ్రాయిల్, పాశ్చత్య దేశాల వారిని టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. ముఖ్యంగా యూదులు ఎక్కువగా ఉండే నారిమన్ హౌజ్ పై దాడికి తెగబడ్డారు. ఇది భారత్ పైన మాత్రమే కాదు యూదులపై జరిగిన దాడిగా ఇజ్రాయిల్ స్పీకర్ అభివర్ణించారు.
స్పీకర్ గా నా మొదటి పర్యటన ఎక్కడికి వెళ్లాలో అని ఆలోచిస్తున్న సమయంలో భారతదేశాన్ని ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించారు. భారత్ అభివృద్ధి చెందుతున్న ప్రధాన శక్తి అని.. ఇజ్రాయిల్ లో సంబంధాలు బలంగా ఉన్నాయని ఆయన అన్నారు. మొదటి ప్రపంచయుద్ధం సమయంలో ఇజ్రాయిల్ లోని హైఫా నగరాన్ని రక్షించేందుకు పోరాడిన భారతీయ సైనికులకు నిశాళులు అర్పించారు. ఆయనతో పాటు చట్టసభ సభ్యుడు మైఖేల్ బిటన్, ఇజ్రాయెల్-భారత్ ఇంటర్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఛైర్మన్ అమిత్ హలేవి కూడా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్తో పాటు పలువురు ఇతర అధికారులను కలవనున్నారు.
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!