Icc World Cup 2023 : భారత్ లో ఆడే ప్రసక్తి లేదు.. లంకలో అయితే ఓకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ను చూసే అవకాశం స్వదేశంలో క్రికెట్ అభిమానులకు లేనట్టేనా.. ప్రస్తుతం ఈ ప్రశ్న క్రికెట్ అభిమానుల మనసుల్లో మెదులుతూనే ఉంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అది కష్టమేనన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఐసీసీ షెడ్యూల్ ప్రకారం భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, పాకిస్థాన్ లో ఆసియా కప్ టోర్నమెంట్ లు జరగాల్సి ఉంది.
Also Read : AP CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ
Also Read
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
అయితే పాక్ లో ఆసియా కప్ ను నిర్వహిస్తే టీమ్ ఇండియా అక్కడికి రాదని బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్ లో కాకుండా తటస్థ వేదికలపైనే తాము ఆడతామని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించారు. దాంతో పాక్ కూడా వన్డే ప్రపంచకప్ లో ఆడేది లేదని ఎప్పటి నుంచో స్పష్టం చేస్తూ వస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాక్ క్రికెట్ బోర్డు కూడా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ప్రపంచ కప్ లో ఆడేందుకు వీరు ఓ కొత్త షరతులను పెట్టారు.
Also Read : VNR Trio: ఆ గన్నులు ఏంటి? బాణం ఏంటి? అసలు ఏం చేస్తున్నారు నితిన్ అన్న…
ఆసియా కప్ కొసం భారత్ తటస్థ వేదికలపైనే ఆడేందుకు ఎలా అయితే మొగ్గు చూపిందో.. పాక్ టీమ్ కూడా వన్డే వరల్డ్ కప్ లో కూడా తాము ఆడాల్సిన మ్యాచ్ లను బంగ్లాదేశ్ లేదా శ్రీలంక దేశాల్లోని మైదానాల్లో నిర్వహించాలంటూ షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఓ వైపు అక్టోబర్-నవంబర్ లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్ కోసం సన్నాహలు జరుగుతున్నాయి. అయినప్పటికీ
ఐసీసీ ఇప్పటి వరకు పూర్తి స్థాయి షెడ్యూల్ ను వెల్లడించలేదు.. ఈ క్రమంలో కొత్త షరతులతో పాక్ క్రికెట్ బోర్డు ముందుకు రావడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. అయితే ఐసీసీ, బీసీసీఐ మాత్రం దీనికి ఒప్పుకోవడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read : Sri Rama Pattabhishekam: నేడు భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకం.. పోటెత్తిన భక్తజనం
ఒకవేళ బీసీసీఐ తమ జట్టును ఆసియా కప్ కోసం పాక్ కు పంపించకపోతే మేము కూడా ప్రపంచకప్ మ్యాచ్ ల కోసం భారత్ కు వచ్చే అవకాశం లేదు.. మా మ్యాచ్ లను కూడా తటస్థ వేదికలపైనే నిర్వహించాలి.. ఇదే మా షరతు అని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆసియా కప్ మ్యాచ్ ల షెడ్యూల్ పై తుది నిర్ణయం వెలువడితేనే ఈ ప్రపంచకప్ సమస్యకూ తెరపడే అవకాశాలు ఉన్నాయి. అయితే పాకిస్థాన్ జట్టు భారత్ కు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అసవరం ఉంది. అలాగే భద్రతరీత్యా దాయాది దేశానికి వెళ్లేందుకు మాత్రం టీమిండియాకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దాదాపు అసాధ్యం.
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!