దేశం మొత్తం ఎవరి పునరాగమనం కోసం ఏడాది పాటు ఎదురుచూస్తుందో.. వారు స్టేడియంలో కనిపించనున్నారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో జస్ప్రీత్ బుమ్రా నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ప్రపంచ కప్కు ముందు అతను నెట్స్లో బౌలింగ్ చేయడమనేది టీమిండియాకు మంచి సంకేతం. కొన్ని వార్త కథనాల ప్రకారం.. బుమ్రా నెట్స్లో 8 నుండి 10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు.. 4 రోజుల్లో వరుసగా రెండోసారి ఓడిపోయింది. బంగ్లాదేశ్ సిరీస్లో భాగంగా చివరి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ టీమిండియాను ఓడించింది. ఆదివారం జరిగిన వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్లో 40 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ఇవాళ(శనివారం) యూఏఈకి వెళ్లారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకంతో పాటు మోడీ ఫోటోను ప్రదర్శించి గ్రాండ్గా వెల్ కమ్ పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు వర్షం దెబ్బకి నానా అవస్థలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లోని గ్రామాలు పూర్తిగా వరద ప్రభావంతో అస్థవ్యస్థం అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, మరోసారి భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది.
టీమిండియా వైస్ కెప్టెన్ రహానేతో మాట్లాడిన మాటలు అందరూ షాక్ కు గురయ్యేలా ఉన్నాయి. రహానే కంటే వారికన్ ఎక్కువ బంతులు ఆడాడని ఇషాన్ స్టంప్ మైక్లో చెప్పాడు. ఈ సమయంలో రహానే స్లిప్ వద్ద నిలబడి.. ఇషాన్ను ఏమి అన్నావని అడిగాడు. ఈ మ్యాచ్లో 11 బంతులు ఎదుర్కొన్న రహానే మూడు పరుగులు చేశాడు.
IND vs WI 1st Test Highlights: డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో విండీస్ 130 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో రోహిత్ సేన ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ (7/71) మరోసారి తన స్పిన్ మాయాజాలం చూపించాడు. అరంగేట్రంలోనే సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ విజయంతో…
ప్రస్తుతం దేశంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. అందులో టమోటా ధరలు బంగారం తో పోటి పడుతూ.. రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి.. ఈ మేరకు టమోటాల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న బెంగుళూరు లో పొలంలో 2 వేల కేజిల టమోటాలను దొంగతనం జరిగిన ఘటన మరవ ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. నేపాల్ నుంచి భారత్కు అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల టమోటాలను కస్టమ్స్ అధికారులు విడుదల చేసిన పరిస్థితులపై విచారణకు…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రోతో పాటు యావత్ భారత్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్-3’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
Mumbai Players Rohit, Shaw, Iyer and Jaiswal Scored Hundred in Test Debut: అంతర్జాతీయ క్రికెట్కు ‘టెస్ట్ క్రికెట్’ వెన్నెముకగా పేరుగాంచింది. ఈ ఏడాదితో టెస్టు క్రికెట్కు 144 ఏళ్లు పూర్తయ్యాయి. మార్చి 1877లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఓ ఆటగాడిలోని ప్రతిభ టెస్ట్ క్రికెట్లో మాత్రమే బయటపడుతుంది. అందుకే ప్రతి ప్లేయర్ సాంప్రదాయ క్రికెట్ ఆడాలని కోరుకుంటారు. అంతేకాదు అరంగేట్రం టెస్టు మ్యాచ్లో సెంచరీ చేయాలని కూడా…