Rahul Gandhi: ముంబై వేదికగా విపక్ష కూటమి తదుపరి భేటీ.. బీజేపీపై రాహుల్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బెంగళూరు వేదికగా విపక్షా కూటమి రెండు రోజు సమావేశం ముగిసింది. ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ‘INDIA’ (ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్) పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం.
Also Read: WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. కొత్త నెంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేసే ఛాన్స్
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఇదిలా ఉండగా.. బీజేపీ సిద్దాంతాలతోనే విపక్ష కూటమి పోరాటం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. విపక్ష కూటమి సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం దేశాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది బీజేపీ, విపక్ష పార్టీల మధ్య యుద్ధం కాదన్న రాహుల్ గాంధీ.. ఇది దేశ ప్రజల స్వతంత్రం,స్వేచ్ఛ కోసం చేస్తున్న యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. తమ పోరాటం ఎన్డీఏ వర్సెస్ ఇండియాగా ఉంటుందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందన్నారు. కొద్దిమంది చేతుల్లోకి దేశం వెళ్లిపోతుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Opposition Alliance: విపక్షాల కూటమి కొత్త పేరు INDIA..
భారత్ ఆలోచనపై దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. కోట్లాది మంది భారతీయుల నుంచి భారత స్వరాన్ని లాక్కొని నరేంద్ర మోడీకి సన్నిహితంగా ఉండే కొద్దిమంది వ్యాపారులకు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. ధరలు పెరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రెండు ఆలోచనల విధానాలకు వ్యతిరేకంగా పోరు సాగుతుందన్నారు. ఇండియాను రక్షించేందుకు తాము పోరాటం చేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. ఇండియాను వ్యతిరేకించేవారికి ఏ గతి పడుతుందో మీకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.తమ ఆలోచనా విధానం దేశం కోసమేనని రాహుల్ గాంధీ చెప్పారు. తమ భవిష్యత్ కార్యాచరణను ముంబై సమావేశంలో ప్రకటిస్తామన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..