Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News 105 Ancient Artefacts To Reach India Prime Minister Modis Visit To America Effect

Modi America Visit Effect: ఇండియాకు చేరనున్న 105 పురాతన కళాఖండాలు..

Published Date :July 18, 2023 , 1:34 pm
By Naga Maneendra
Modi America Visit Effect:  ఇండియాకు చేరనున్న 105 పురాతన కళాఖండాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Modi America Visit Effect: అమెరికా ఇండియాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలే కాకుండా.. సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన అనంతరం అమెరికాలో ఉన్న పురాతన కళాఖండాల్లో కొన్నింటిని ఇండియాకు ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగిసిన తరువాత భారత్ కుచెందిన పురాతన కళాఖండాలని యూఎస్ తిరిగి మన దేశానికి ఇచ్చేసింది. వీటిని మన దేశ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే అవి ఇండియాకు చేరుకోనున్నాయి. ప్రధాని మోడీ అమెరికా పర్యటన అనంతరం క్రీస్తుశకం 2 నుంచి 3వ శతాబ్దం నుంచి 18-19వ శతాబ్దం వరకు ఉన్న మొత్తం 105 పురాతన వస్తువులను అమెరికా భారత్ కు తిరిగి ఇచ్చింది. వీటిని మన దేశానికి తీసుకొచ్చేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు, కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, మాన్ హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయ అధికారుల సమక్షంలో న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కొన్ని విలువైన భారతీయ పురాతన కళాఖండాలను అమెరికా అందజేసింది.

Read also: Telangana Congress: తొలిసారి గాంధీభవన్‌కు పొంగులేటి.. ఘన స్వాగతం పలికిన నేతలు

Also Read

  • Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
  • Cole Thomas Allen: సాఫ్ట్‌వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
  • Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..

అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు.. మాట్లాడుతూ భారత్ కు తరలిస్తున్న 100 పురాతన వస్తువులు కేవలం కళ మాత్రమే కావని, మన వారసత్వం, సంస్కృతి, మతంలో భాగమని అన్నారు. కోల్పోయిన ఈ వారసత్వం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, చాలా భావోద్వేగంతో స్వీకరిస్తున్నామని అన్నారు. త్వరలోనే పురాతత్వ వస్తువులు కూడా భారత్ కు వస్తాయని తెలిపారు. మాన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు, ఇతర ఏజెన్సీలు అనేక కళాఖండాలను భారతదేశానికి తిరిగి పంపించడానికి సహాయపడ్డాయని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Read also: Indrakaran Reddy: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసిన దిలావ‌ర్ పూర్ మండ‌ల రైతులు

సాంస్కృతిక ఆస్తుల అక్రమ వాణిజ్యాన్ని నిరోధించడానికి, సాంస్కృతిక ఆస్తి ఒప్పందం కోసం పనిచేయడానికి భారత్, అమెరికా అంగీకరించాయి. ఇది మా ఏజెన్సీల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. స్మగ్లర్లు చట్టాలను తప్పించుకోవడం కష్టతరం చేస్తుందని సంధు అన్నారు. మాన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జోర్డాన్ స్టాక్డేల్ మాట్లాడుతూ.. గత ఏడాది అమెరికా 300కు పైగా పురాతన వస్తువులను భారత్ కు తిరిగి పంపిందని తెలిపారు. ఇంకా 1400కు పైగా వస్తువులను స్మగ్లర్ ల నుంచి స్వాధీనం చేసుకున్నామని, వాటిని ఇంకా అధికారికంగా ఇండియాకు పంపించాల్సి ఉందన్నారు. ఇటీవల వైట్ హౌస్ లో ప్రధాని మోడీ మాట్లాడిన మాటలను తాము అభినందిస్తున్నామన్నారు. గత నెలలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా భారత్ కోల్పోయిన ఈ సాంస్కృతిక ఆస్తులను తిరిగి ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. దీంతో అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. 2016లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా 16 పురాతన వస్తువులను మొదటి సారిగా అమెరికా అందజేసింది. 2021 సెప్టెంబర్ లో ప్రధాని అమెరికా పర్యటన తర్వాత భారత్ కు 157 కళాఖండాలను అప్పగించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 105 Ancient Artefacts
  • america
  • india
  • Modi's Visit
  • Reach India

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions