2026 టీ20 ప్రపంచకప్లో భారత్తో జరిగే లీగ్ మ్యాచ్ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయంపై మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐసీసీ టోర్నమెంట్లో సెలెక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటికే పాక్ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని నెదర్లాండ్స్పై గెలుపుతో ప్రారంభించింది. మంగళవారం (ఫిబ్రవరి 10) అమెరికాతో తదుపరి మ్యాచ్ ఆడనుంది. అయితే…
T20 World Cup: T20 ప్రపంచ కప్ వివాదాలకు కేంద్రంగా మారింది. భారత్లో భద్రతా కారణాలు చూపుతూ, బంగ్లాదేశ్ ఆడటానికి నిరాకరించింది. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. దీంతో ఐసీసీ బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి బహిష్కరించింది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది.
T20 World Cup Row: టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడటానికి పాకిస్తాన్ తిరస్కరించిన అంశంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అంత ఈజీగా వదిలి పెట్టేలా కనిపించడం లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ రెడీ అయింది.
India vs Pakistan: T20 ప్రపంచ కప్ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచం దృష్టి ఇప్పుడు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్పై నెలకొంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా.? లేదా? అనే సందేహాలు ఇంకా ఉన్నాయి. బంగ్లాదేశ్ టోర్నీ బహిష్కరణకు మద్దతుగా భారత్తో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత్తో మ్యాచ్ ఆడబోవడం లేదని చెప్పారు. అయితే, ఐసీసీ నుంచి చర్యలు, ఆర్థిక నష్టం,…
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతోంది. కానీ ఇప్పటి వరకు పాకిస్థాన్ వైఖరి మార్చుకోలేదు. ఇండియాతో ఆడమని తేల్చి చెప్పేస్తున్నారు. పాకిస్థాన్ భారత్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తుందని చెప్పడంతో టీ20 వరల్డ్ కప్లో పెద్ద గందరగోళం మొదలైంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు.. ఇరు దేశాల మధ్య మ్యాచ్లు ఉత్కంఠ భరితమైన క్షణాలు.. ఈ…
T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ 2026 వివాదం పెరుగుతోంది. బంగ్లాదేశ్ టోర్నీని బహిష్కరించడంపై పాకిస్తాన్, భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని ప్రకటించింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘పాక్ బంగ్లాదేశ్తో నిలుస్తుంది’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తూ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కీలక వ్యాఖ్యలు చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలనే నిర్ణయంపై స్పందించిన సూర్య.. పాక్తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఐసీసీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని, భారత్ ఎప్పుడూ పాక్తో ఆడేందుకు నిరాకరించలేదని వెల్లడించాడు.…
ICC Warns Pakistan: మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ( ఫిబ్రవరి 7న) టీ20 వరల్డ్ కప్ 2026పై వివాదం కొనసాగుతుంది. ఈ నెల (ఫిబ్రవరి) 15న కొలంబోలో భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను బహిష్కరించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై న్యాయపరమైన చర్యలు తప్పవని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హెచ్చరించింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆర్థిక పరిస్థితిపై మాజీ ఛైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది? అని పరోక్షంగా చెప్పారు. రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమీజ్ రాజా.. పీసీబీ ఆదాయంలో సగానికి పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి వస్తుందని అంగీకరించారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఐసీసీకి వచ్చే…
అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ టోర్నీలు అంటే క్రీడాభిమానులకు పండగే. కానీ భద్రతా సమస్యలు, రాజకీయ పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో మ్యాచ్లు జరగకుండానే బహిష్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా అదే జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న భారత్తో జరిగే లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించగా.. పీసీబీ నుంచి ఐసీసీకి ఇంకా అధికారిక ప్రకటన వెళ్లలేదు. ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ టోర్నీల్లో…