Suryakumar Yadav: పాకిస్థాన్తో ఆడేందుకు భారత్ సిద్ధం.. కొలంబో ఫ్లైట్ బుక్ అయింది!
- ఫిబ్రవరి 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్
- సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
- పాకిస్థాన్తో ఆడేందుకు భారత్ సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలనే నిర్ణయంపై స్పందించిన సూర్య.. పాక్తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఐసీసీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని, భారత్ ఎప్పుడూ పాక్తో ఆడేందుకు నిరాకరించలేదని వెల్లడించాడు.
పాకిస్థాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఐసీసీ ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తుందన్న దానిపై ఆసక్తి పెరిగింది. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్లో ఉండగా.. శ్రీలంకతో కలిసి భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం వహిస్తోంది. భారత్–పాక్ మ్యాచ్ను కొలంబోలో నిర్వహించాలని ఐసీసీ ముందుగానే నిర్ణయించింది. ముంబైలో మీడియాతో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘మా మైండ్సెట్ చాలా క్లియర్. మేము పాక్తో ఆడేందుకు ఎప్పుడూ నిరాకరించలేదు. పాక్ వైపు నుంచి నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ ఫిక్చర్ ఇచ్చింది, ప్రభుత్వాలు న్యూట్రల్ వేదికను నిర్ణయించాయి. కొలంబోకి మా ఫ్లైట్ ఇప్పటికే బుక్ అయింది. మ్యాచ్ కోసం మేము వెళ్తాం కూడా. ఆ తర్వాత ఏమవుతుందో మా చేతుల్లో లేదు’ అని అన్నారు.
Also Read
- India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
- ODI World Cup 2027: ద్రవిడ్ ప్లానింగ్ లేకుండా ఉంటాడా?.. 2027 వరల్డ్ కప్కు బ్లూప్రింట్ సిద్ధం!
- Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే!
Also Read: Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ‘ఉస్తాద్’ సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరిస్తే.. పాక్ జట్టు రెండు పాయింట్లు కోల్పోయే అవకాశముంది. అయితే దీనికి మించి పీసీబీపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇంకా స్పష్టత లేదు. పాకిస్థాన్పై బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలానే ఏ టీమ్ కూడా పాక్ వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే పీఎస్ఎస్ టోర్నీలో కూడా విదేశీ ప్లేయర్స్ ఆడకుండా కూడా ఐసీసీ బ్యాన్ చేయనుంది. మెగా టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ఈ వివాదం చోటుచేసుకోవడంతో.. టీ20 వరల్డ్ కప్ 2026పై ప్రపంచ క్రికెట్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.
తాజావార్తలు
-
AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!