T20 World Cup 2026: ఐసీసీ టోర్నీల్లో బహిష్కరణ మ్యాచ్లు.. లిస్టులో టాప్ టీమ్స్!
- ఐసీసీ టోర్నీలు అంటే క్రీడాభిమానులకు పండగే
- భద్రతా, రాజకీయ పరిస్థితుల కారణంగా బహిష్కరణకు గురైన మ్యాచ్లు
- బహిష్కరణ లిస్టులో టాప్ టీమ్స్
అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ టోర్నీలు అంటే క్రీడాభిమానులకు పండగే. కానీ భద్రతా సమస్యలు, రాజకీయ పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో మ్యాచ్లు జరగకుండానే బహిష్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా అదే జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న భారత్తో జరిగే లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించగా.. పీసీబీ నుంచి ఐసీసీకి ఇంకా అధికారిక ప్రకటన వెళ్లలేదు. ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ టోర్నీల్లో జరిగిన బహిష్కరణ మ్యాచ్లపై ఓసారి లుక్కేద్దాం.
1996 వన్డే వరల్డ్కప్:
1996 వన్డే వరల్డ్కప్లో శ్రీలంకలో ఆడాల్సిన రెండు మ్యాచ్లు భద్రతా కారణాలతో బహిష్కరణకు గురయ్యాయి. శ్రీలంకతో మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. అదే వరల్డ్కప్లో వెస్టిండీస్ కూడా శ్రీలంకతో ఆడాల్సిన మ్యాచ్ను భద్రతా సమస్యలను చూపిస్తూ బహిష్కరించింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ శ్రీలంకకు వాక్ ఓవర్ లభించింది. అప్పట్లో ఈ నిర్ణయాలు పెద్ద చర్చకు దారి తీశాయి.
Also Read
- KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
- PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
- DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్..
- KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
2003 వన్డే వరల్డ్కప్:
2003 వన్డే వరల్డ్కప్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్ను ఇంగ్లాండ్ భద్రతా, రాజకీయ కారణాలను పేర్కొంటూ బహిష్కరించింది. దాంతో ఆ మ్యాచ్లో జింబాబ్వేకు పాయింట్లు లభించాయి. అదే టోర్నీలో కెన్యాతో ఆడాల్సిన మ్యాచ్ను న్యూజిలాండ్ ఉగ్రవాద భయం కారణంగా ఆడలేదు. ఈ సంఘటనలు ఆ వరల్డ్కప్పై తీవ్ర ప్రభావం చూపాయి.
Also Read: T20 World Cup 2026: పాకిస్థాన్కు డేంజర్ బెల్స్.. రెండు మ్యాచ్లు ఓడితే ఇంటికే!
2026 టీ20 వరల్డ్కప్:
ఇప్పుడు 2026 టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్-భారత్ మ్యాచ్ కూడా బహిష్కరణ దిశగా సాగుతోంది. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల భారత్తో మ్యాచ్ను పాక్ బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది నిజమైతే.. ఐసీసీ టోర్నీల చరిత్రలో మరో వివాదాస్పద ఘటనగా ఈ మ్యాచ్ నమోదు అవుతుంది. క్రికెట్లో రాజకీయాలు, భద్రతా అంశాలు జోక్యంతో అభిమానులకు నిరాశే మిగిలింది. ఐసీసీ టోర్నీల్లో ఇలాంటి బహిష్కరణలు మళ్లీ జరగకుండా క్రీడా స్ఫూర్తి నిలబడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!