T20 World Cup 2026: ఐసీసీ టోర్నీల్లో బహిష్కరణ మ్యాచ్లు.. లిస్టులో టాప్ టీమ్స్!
- ఐసీసీ టోర్నీలు అంటే క్రీడాభిమానులకు పండగే
- భద్రతా, రాజకీయ పరిస్థితుల కారణంగా బహిష్కరణకు గురైన మ్యాచ్లు
- బహిష్కరణ లిస్టులో టాప్ టీమ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ టోర్నీలు అంటే క్రీడాభిమానులకు పండగే. కానీ భద్రతా సమస్యలు, రాజకీయ పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో మ్యాచ్లు జరగకుండానే బహిష్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా అదే జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న భారత్తో జరిగే లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించగా.. పీసీబీ నుంచి ఐసీసీకి ఇంకా అధికారిక ప్రకటన వెళ్లలేదు. ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ టోర్నీల్లో జరిగిన బహిష్కరణ మ్యాచ్లపై ఓసారి లుక్కేద్దాం.
1996 వన్డే వరల్డ్కప్:
1996 వన్డే వరల్డ్కప్లో శ్రీలంకలో ఆడాల్సిన రెండు మ్యాచ్లు భద్రతా కారణాలతో బహిష్కరణకు గురయ్యాయి. శ్రీలంకతో మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. అదే వరల్డ్కప్లో వెస్టిండీస్ కూడా శ్రీలంకతో ఆడాల్సిన మ్యాచ్ను భద్రతా సమస్యలను చూపిస్తూ బహిష్కరించింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ శ్రీలంకకు వాక్ ఓవర్ లభించింది. అప్పట్లో ఈ నిర్ణయాలు పెద్ద చర్చకు దారి తీశాయి.
Also Read
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
- Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
2003 వన్డే వరల్డ్కప్:
2003 వన్డే వరల్డ్కప్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్ను ఇంగ్లాండ్ భద్రతా, రాజకీయ కారణాలను పేర్కొంటూ బహిష్కరించింది. దాంతో ఆ మ్యాచ్లో జింబాబ్వేకు పాయింట్లు లభించాయి. అదే టోర్నీలో కెన్యాతో ఆడాల్సిన మ్యాచ్ను న్యూజిలాండ్ ఉగ్రవాద భయం కారణంగా ఆడలేదు. ఈ సంఘటనలు ఆ వరల్డ్కప్పై తీవ్ర ప్రభావం చూపాయి.
Also Read: T20 World Cup 2026: పాకిస్థాన్కు డేంజర్ బెల్స్.. రెండు మ్యాచ్లు ఓడితే ఇంటికే!
2026 టీ20 వరల్డ్కప్:
ఇప్పుడు 2026 టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్-భారత్ మ్యాచ్ కూడా బహిష్కరణ దిశగా సాగుతోంది. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల భారత్తో మ్యాచ్ను పాక్ బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది నిజమైతే.. ఐసీసీ టోర్నీల చరిత్రలో మరో వివాదాస్పద ఘటనగా ఈ మ్యాచ్ నమోదు అవుతుంది. క్రికెట్లో రాజకీయాలు, భద్రతా అంశాలు జోక్యంతో అభిమానులకు నిరాశే మిగిలింది. ఐసీసీ టోర్నీల్లో ఇలాంటి బహిష్కరణలు మళ్లీ జరగకుండా క్రీడా స్ఫూర్తి నిలబడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..