T20 World Cup 2026: ఐసీసీ టోర్నీల్లో బహిష్కరణ మ్యాచ్లు.. లిస్టులో టాప్ టీమ్స్!
- ఐసీసీ టోర్నీలు అంటే క్రీడాభిమానులకు పండగే
- భద్రతా, రాజకీయ పరిస్థితుల కారణంగా బహిష్కరణకు గురైన మ్యాచ్లు
- బహిష్కరణ లిస్టులో టాప్ టీమ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ టోర్నీలు అంటే క్రీడాభిమానులకు పండగే. కానీ భద్రతా సమస్యలు, రాజకీయ పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో మ్యాచ్లు జరగకుండానే బహిష్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా అదే జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న భారత్తో జరిగే లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించగా.. పీసీబీ నుంచి ఐసీసీకి ఇంకా అధికారిక ప్రకటన వెళ్లలేదు. ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ టోర్నీల్లో జరిగిన బహిష్కరణ మ్యాచ్లపై ఓసారి లుక్కేద్దాం.
1996 వన్డే వరల్డ్కప్:
1996 వన్డే వరల్డ్కప్లో శ్రీలంకలో ఆడాల్సిన రెండు మ్యాచ్లు భద్రతా కారణాలతో బహిష్కరణకు గురయ్యాయి. శ్రీలంకతో మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. అదే వరల్డ్కప్లో వెస్టిండీస్ కూడా శ్రీలంకతో ఆడాల్సిన మ్యాచ్ను భద్రతా సమస్యలను చూపిస్తూ బహిష్కరించింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ శ్రీలంకకు వాక్ ఓవర్ లభించింది. అప్పట్లో ఈ నిర్ణయాలు పెద్ద చర్చకు దారి తీశాయి.
Also Read
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
- Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
- Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
2003 వన్డే వరల్డ్కప్:
2003 వన్డే వరల్డ్కప్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్ను ఇంగ్లాండ్ భద్రతా, రాజకీయ కారణాలను పేర్కొంటూ బహిష్కరించింది. దాంతో ఆ మ్యాచ్లో జింబాబ్వేకు పాయింట్లు లభించాయి. అదే టోర్నీలో కెన్యాతో ఆడాల్సిన మ్యాచ్ను న్యూజిలాండ్ ఉగ్రవాద భయం కారణంగా ఆడలేదు. ఈ సంఘటనలు ఆ వరల్డ్కప్పై తీవ్ర ప్రభావం చూపాయి.
Also Read: T20 World Cup 2026: పాకిస్థాన్కు డేంజర్ బెల్స్.. రెండు మ్యాచ్లు ఓడితే ఇంటికే!
2026 టీ20 వరల్డ్కప్:
ఇప్పుడు 2026 టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్-భారత్ మ్యాచ్ కూడా బహిష్కరణ దిశగా సాగుతోంది. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల భారత్తో మ్యాచ్ను పాక్ బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది నిజమైతే.. ఐసీసీ టోర్నీల చరిత్రలో మరో వివాదాస్పద ఘటనగా ఈ మ్యాచ్ నమోదు అవుతుంది. క్రికెట్లో రాజకీయాలు, భద్రతా అంశాలు జోక్యంతో అభిమానులకు నిరాశే మిగిలింది. ఐసీసీ టోర్నీల్లో ఇలాంటి బహిష్కరణలు మళ్లీ జరగకుండా క్రీడా స్ఫూర్తి నిలబడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!