T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!
- మాజీ క్రికెటర్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్
- భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?
- ఐసీసీ ఆదాయంలో భారత్ పాత్ర అత్యంత కీలకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆర్థిక పరిస్థితిపై మాజీ ఛైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది? అని పరోక్షంగా చెప్పారు. రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమీజ్ రాజా.. పీసీబీ ఆదాయంలో సగానికి పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి వస్తుందని అంగీకరించారు.
ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఐసీసీకి వచ్చే మొత్తంలో సుమారు 90 శాతం డబ్బు బీసీసీఐ భారత్ క్రికెట్ బోర్డు (బీసీసీఐ) నుంచే వస్తుందని రమీజ్ రాజా వెల్లడించారు. ఐసీసీ ఆదాయంలో భారత్ పాత్ర అత్యంత కీలకం అని చెప్పుకొచ్చారు. ‘ఒకవేళ ఐసీసీకి బీసీసీఐ నిధులు ఇవ్వడం ఆపేస్తే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కుప్పకూలే పరిస్థితి వస్తుంది’ అని రమీజ్ రాజా స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ ఆర్థికంగా ఎంతగా ఇతరులపై ఆధారపడిందో ఇట్టే అర్ధమవుతోంది. ముఖ్యంగా భారత్తో రాజకీయంగా గొడవలు పెట్టుకుంటూనే.. క్రికెట్ పరంగా మాత్రం భారత డబ్బులపై ఆధారపడటం ఇప్పుడు నెట్టింట చర్చనీయంశంగా మారింది.
Also Read
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
- Ben Stokes Returns: 'క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది'.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
- India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
రమీజ్ రాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ‘పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ చేస్తుంది కానీ.. బతుకేది మాత్రం ఇండియా డబ్బులపైనే’ అంటూ నెటిజన్లు పీసీబీపై సెటైర్లు విసురుతున్నారు. క్రికెట్లో రాజకీయాలు పక్కన పెట్టి.. ఆటపై దృష్టి పెట్టాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాక్ అన్ని విధాలుగా నష్టపోనుంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ మాజీలు కూడా పీసీబీపై మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!