T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!
- మాజీ క్రికెటర్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్
- భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?
- ఐసీసీ ఆదాయంలో భారత్ పాత్ర అత్యంత కీలకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆర్థిక పరిస్థితిపై మాజీ ఛైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది? అని పరోక్షంగా చెప్పారు. రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమీజ్ రాజా.. పీసీబీ ఆదాయంలో సగానికి పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి వస్తుందని అంగీకరించారు.
ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఐసీసీకి వచ్చే మొత్తంలో సుమారు 90 శాతం డబ్బు బీసీసీఐ భారత్ క్రికెట్ బోర్డు (బీసీసీఐ) నుంచే వస్తుందని రమీజ్ రాజా వెల్లడించారు. ఐసీసీ ఆదాయంలో భారత్ పాత్ర అత్యంత కీలకం అని చెప్పుకొచ్చారు. ‘ఒకవేళ ఐసీసీకి బీసీసీఐ నిధులు ఇవ్వడం ఆపేస్తే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కుప్పకూలే పరిస్థితి వస్తుంది’ అని రమీజ్ రాజా స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ ఆర్థికంగా ఎంతగా ఇతరులపై ఆధారపడిందో ఇట్టే అర్ధమవుతోంది. ముఖ్యంగా భారత్తో రాజకీయంగా గొడవలు పెట్టుకుంటూనే.. క్రికెట్ పరంగా మాత్రం భారత డబ్బులపై ఆధారపడటం ఇప్పుడు నెట్టింట చర్చనీయంశంగా మారింది.
Also Read
- Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
రమీజ్ రాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ‘పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ చేస్తుంది కానీ.. బతుకేది మాత్రం ఇండియా డబ్బులపైనే’ అంటూ నెటిజన్లు పీసీబీపై సెటైర్లు విసురుతున్నారు. క్రికెట్లో రాజకీయాలు పక్కన పెట్టి.. ఆటపై దృష్టి పెట్టాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాక్ అన్ని విధాలుగా నష్టపోనుంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ మాజీలు కూడా పీసీబీపై మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?