Home
India Pakistan Relations
India Pakistan Relations News
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
Indus Waters Treaty: పాకిస్తాన్ మరోసారి ‘‘సింధు జలాల ఒప్పందం’’పై స్పందించింది. ఆ దేశ ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఇటీవల ఇండస్ వాటర్ ట్రీటీ, దక్షిణాసియాలో భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది నీటిని ఆపేయడం ద్వారా భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా నీటిని ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఒక నదీతీర దేశమని, అక్కడి నుంచి ప్రవహించే నదులు పాకిస్తాన్లోకి ప్రవేశిస్తాయని ఇక్బాల్ పేర్కొన్నారు.… -
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
India-Pakistan Tensions: భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్న వేళ ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ బయట ఏర్పాటు చేసిన బాహ్య భద్రతా పరిధిని భారత అధికారులు తొలగించారు. దౌత్య కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బొల్లార్డులు, బారికేడ్లను తొలగించినట్లు సమాచారం. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల పాకిస్థాన్ అధికారులు భద్రతా బారికేడ్లను తొలగించిన మూడు రోజుల తర్వాత భారత్ ఈ చర్య తీసుకోవడం గమనార్హం. దీంతో ఇరు… -
PoKలో PML-N జెండా.. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు అన్నను ‘ప్రధాని’ చేస్తాడా?
PoK Polls: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అసెంబ్లీ ఎన్నికల్లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొదటి రెండు దశల పోలింగ్లో ఆ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఎన్నికల ప్రచార సమయంలో ముజఫరాబాద్లో జరిగిన సభలో నవాజ్ షరీఫ్… -
PM Modi: పాకిస్థాన్ నుంచి మోడీకి ఆహ్వానం.. మోడీ దాయాది దేశానికి వెళ్తారా?
PM Modi: 2027లో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా స్పష్టం చేసింది. ఒక మీడియా సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. SCO సభ్యదేశాలన్నింటికీ నిబంధనల ప్రకారం ఆహ్వానాలు పంపుతామని వెల్లడించారు. ఈ సంస్థ ప్రోటోకాల్ ప్రక్రియ ప్రకారం, ఆతిథ్యం ఇచ్చే దేశం సభ్యదేశాల అధినేతలను, ప్రభుత్వ నాయకులను ఆహ్వానించడం ఒక బాధ్యత అని, కాబట్టి భారత్ కూడా… -
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) విషయంలో భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. పాకిస్థాన్ నుంచి ఒప్పందాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో, 1960లో కుదిరిన 65 ఏళ్ల నాటి ఒప్పందాన్ని ప్రస్తుత రూపంలో తిరిగి అమలు చేసే అవకాశం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం వెల్లడించింది. భవిష్యత్తులో ఏ కొత్త ఒప్పందమైనా పాకిస్థాన్ ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి పలికిన తర్వాతే సాధ్యమవుతుందని… -
POK Protests: పీవోకేలో నిరసనల వేళ కాశ్మీర్ కార్డు.. పాక్ ఆర్మీ చీఫ్ తాజా వ్యాఖ్యలు
POK Protests: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్న వేళ, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్పై ఆరోపణలు చేశారు. రావల్పిండిలోని జనరల్ హెడ్క్వార్టర్స్లో జరిగిన 276వ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఆయన కాశ్మీర్ను పాకిస్తాన్కు అత్యంత కీలకమైన అంశంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా జమ్మూ-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు, జనాభా మార్పులకు భారత్ పాల్పడుతోందని పాకిస్తాన్ సైన్యం ఆరోపించింది. పాకిస్తాన్ సైన్యం… -
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
POK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, పాకిస్తాన్ను తాను చేస్తున్న దుర్మార్గాలకు అంతర్జాతీయ సమాజం ముందు జవాబుదారీగా నిలబెట్టాలని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయని ఆరోపించారు.… -
India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
India At UN: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. దీనికి ప్రతిగా యథావిధిగా భారత్ చేతిలో అవమానాన్ని ఎదుర్కోంది. జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్గత విషయమని, తప్పుడు మరియు కల్పిత కథనాలను వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల్ని ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి భద్రతా మండలి సమర్పించి వార్షిక నివేదికపై జరిగిన చర్చ సమయంలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్… -
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని, భద్రతా మండలిలో పాకిస్థాన్పై తీవ్ర విమర్శలు చేశారు. సాయుధ ఘర్షణలలో పౌరుల రక్షణపై యూఎన్ఎస్సీ నిర్వహించే వార్షిక బహిరంగ చర్చలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వేదికపై పాకిస్థాన్ క్రూరత్వాన్ని బట్టబయలు చేశారు. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్థాన్ కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన భారత్, “జాతి నిర్మూలన చరిత్ర కలిగిన దేశం కశ్మీర్ గురించి ఉపన్యాసాలు ఇవ్వడం… -
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
Army Chief: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఇలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, భారత్కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, ఆ దేశం భౌగోళికంగా ఉండాలనుకుంటున్నారా? లేదా చరిత్రలో భాగంగా కావాలనుకుంటున్నారో తేల్చుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఆర్మీ చీఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. మరోసారి పహల్గామ్ లాంటి దాడి జరిగితే భారత సైన్యం అదే రీతిలో లేదా…
తాజావార్తలు
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!