Balochistan: పాక్ గడ్డ నుంచి భారత్కు తిరుగులేని మద్దతు.. జైశంకర్కు బలోచ్ నేత బహిరంగ లేఖ..
- పాకిస్తాన్ నుంచి భారత్కు తిరుగులేని మద్దతు..
- జైశంకర్కు బలోచ్ నాయకుడి బహిరంగ లేఖ..
- భారత్-బలూచ్ సంబంధాలు హైలెట్..
- చైనా దళాలు బలూచిస్తాన్లో మోహరించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balochistan: భారతదేశానికి పాకిస్తాన్ గడ్డ నుంచి తిరుగులేని మద్దతు వచ్చింది. ప్రముఖ బలూచ్ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ పాక్-చైనా సంబంధాలు తీవ్రం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో చైనా తన సైన్యాన్ని బెలూచిస్తాన్లో మోహరించవచ్చని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు రాసిన బహిరంగ లేఖలో, బెలూచిస్తాన్ దశాబ్దాలుగా పాకిస్తాన్ నియంత్రణలో అణచివేతను ఎదుర్కొంటోందని, అందులో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Read Also: AP Deputy CM Pawan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. 96 గదుల నిర్మాణానికి శంకుస్థాపన
Also Read
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
బలూచ్ జాతీయవాద నాయకులు మే 2025లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించారు. 2026 మొదటి వారంలో రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ “2026 బెలూచిస్తాన్ గ్లోబల్ డిప్లొమాటిక్ వీక్”ను జరుపుకుంటుందని మీర్ బలూచ్ తాజాగా ప్రకటించారు. దీని వలన బెలూచిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. లేఖలో ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్పై భారత్ తీసుకున్న చర్యల్ని ప్రశంసించారు. పాక్పై భారత్ దాడి ఆదర్శప్రాయమైన ధైర్యం, ప్రాంతీయ భద్రత, న్యాయం పట్ల దృఢమైన నిబద్ధతకు నిదర్శనమని మీర్ బలూచ్ అన్నారు.
లేఖలో ఆయన 140 కోట్ల భారత ప్రజలకు ఆరు కోట్ల బెలూచిస్తాన్ ప్రజల తరుపున న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. లేఖలో బలూచిస్తాన్ ఇండియా మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను హైలెట్ చేశారు. హింగ్లాజ్ మాత మందిరం రెండు దేశాల మధ్య శాశ్వత సంబంధాలకు నిదర్శనమని అన్నారు. పాక్, చైనా వ్యూహాత్మక కూటమి గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC)ను దాని చివరి దశలకు చేర్చిందని ఆయన హెచ్చరించారు. బలూచిస్తాన్ రక్షణ, తమ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేయకపోతే దీర్ఘకాలంలో చైనా దళాలు బలూచిస్తాన్లో మోహరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే జరిగితే భారత్, బలూచిస్తాన్లకు ముప్పు కలుగుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!