New Regional Alliance: భారత్పై కుట్రకు ప్లాన్ చేస్తున్న పాక్.. డ్రాగన్తో కొత్త కూటమికి సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Regional Alliance: పాకిస్థాన్ ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇది ప్రాంతీయ పొత్తులను మార్చగలదు, అలాగే భారతదేశం యొక్క దీర్ఘకాల ప్రాంతీయ ఆధిపత్యాన్ని సవాలు చేయగలదు. అదే సమయంలో దక్షిణాసియా సహకార పటాన్ని తిరిగి గీయగలదు. దీంతో పాకిస్థాన్ కేంద్రబిందువుగా దక్షిణాసియా ఒక పెద్ద భౌగోళిక రాజకీయ మార్పుకు గురి కాబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. పాకిస్థాన్ – బంగ్లాదేశ్ – చైనాల మధ్య పెరుగుతున్న త్రైపాక్షిక చొరవలో ఇతర దక్షిణాసియా దేశాలను కూడా చేర్చవచ్చని చెప్పారు.
READ ALSO: CMRF Record : సీఎం సహాయ నిధి పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు
Also Read
- Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
- EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
- Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
- Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
దీనిని ఆయన సాంకేతికత, కనెక్టివిటీ, ఆర్థిక అభివృద్ధిపై సౌకర్యవంతమైన భాగస్వామ్యంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కొత్త సమూహం కోసం ఆలోచన కొత్త SAARC (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) లాంటిది. కానీ ఈ కొత్త కూటమిలో భారతదేశం లేదు.
తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. పాకిస్థాన్ లక్ష్యం సంఘర్షణ కాదు, సహకారం అని అన్నారు. కానీ ఈ దౌత్య భాష వెనుక ఒక కఠినమైన రాజకీయ వాస్తవికత ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎనిమిది దేశాల (భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, భూటాన్, శ్రీలంక) ప్రాంతీయ సంస్థ దాదాపు పదేళ్లుగా స్తంభించిపోయింది. భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు దాని శిఖరాగ్ర సమావేశాలకు పదేపదే అంతరాయం కలిగించాయి. అలాగే ఒప్పందాలను నిలిపివేయడం, సమూహం యొక్క పురోగతిని అడ్డుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో భారతదేశం, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఘర్షణ తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చరిత్రలో లేనంత దిగువ స్థాయికి దిగజారాయి. సార్క్ అనేది ఇప్పుడు పేరుకు మాత్రమే ఒక సంస్థ.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారతదేశంతో – బంగ్లాదేశ్ సంబంధాలు క్షీణించడం సార్క్ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. బంగ్లాదేశ్ నుంచి భారతదేశం దూరమవుతున్న సమయంలో చైనా నిశ్శబ్దంగా బంగ్లాదేశ్ రాజకీయ, ఆర్థిక నిర్మాణంలో తన ప్రభావాన్ని పెంచుకుంటుంది.
సార్క్ బలహీనపడటం వల్ల పాకిస్థాన్ ఈ కూటమి స్థానంలో కొత్త కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. ఇదే సమయంలో శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు వంటి చిన్న దేశాలు వాతావరణ మార్పు, మౌలిక సదుపాయాలపై ప్రాంతీయ సహకారం కోసం చాలా కాలంగా పిలుపునిస్తున్నాయి. ఈ దిశలో పాక్ కొత్త చర్చలపై ఈ ఆసక్తి చూపవచ్చు. కానీ చైనా, పాన్ నేతృత్వంలోని ఈ కొత్త కూటమిలో భారత్ లేకుండా ఇండియాపై ఆధారపడిన దేశాలకు చేరవు. ఎందుకంటే ఆయా దేశాలు ఇప్పటికే భారత్తో ఉన్న సత్సంబంధాలను ప్రమాదంలో పడేయాలని చూడవని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాతావరణం తనకు అనుకూలంగా ఉందని పాకిస్థాన్ విశ్వసిస్తోంది. అయితే పాక్ ప్రతిపాదన దక్షిణాసియాకు ఒక మలుపు తిరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఈ కొత్త కూటమి ఏర్పాటును భారత్ నిశితంగా గమనిస్తోంది.
READ ALSO: ICC ODI Rankings: నంబర్-1 కుర్చీ ఎవరిది? RO-KO మధ్య రేర్ క్లాష్..
తాజావార్తలు
-
Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
-
EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
-
Netflix: నెట్ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: కొత్త కథా రచయితల కోసం క్రేజీ ఛాన్స్!
-
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
-
July Releases : జూలై బాక్స్ ఆఫీస్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆరుగురు హీరోలు
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?