ఆస్ట్రేలియాపై సిరీస్ విజయోత్సాహంతో టీ20 ప్రపంచకప్కు ముందు మరో టీ20 సిరీస్కు రోహిత్ సేన సిద్ధమైంది. ఆస్ట్రేలియాపై గెలిచిన రెండు రోజుల వ్యవధిలోనే సఫారీతో రెండో వేటకు సిద్ధమైంది.
IND Vs SA: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా జోరు మీద కనిపిస్తోంది. బుధవారం నుంచి సొంతగడ్డపై మరో టీ20 సిరీస్కు సిద్ధమవుతోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్కు సెలక్టర్లు ముందుగానే హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్కు విశ్రాంతి కల్పించారు. అటు కరోనా కారణంగా ఆసీస్తో సిరీస్కు దూరమైన షమీ దక్షిణాఫ్రికాతో సిరీస్కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆల్రౌండర్ దీపక్ హుడా కూడా…
IND Vs SA: ఆసియా కప్లో ఘోర వైఫల్యంతో సూపర్4 దశలో ఇంటి ముఖం పట్టిన టీమిండియా టీ20 ప్రపంచకప్ సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో వరుసగా మూడు టీ20ల సిరీస్ను ఆడనుంది. సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో ఆస్ట్రేలియాతో మూడు టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మూడు వన్డేల సిరీస్లో కూడా తలపడనుంది.…
రిషభ్ పంత్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే.. టెస్టుల్లో అదరగొడుతున్నాడు కానీ, పరిమిత ఓవర్లలోనే సరిగ్గా రాణించట్లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో విఫలమైన పంత్.. ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్లో మాత్రం మెరుపులు మెరిపించాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతోనూ, రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతోనూ చెలరేగిపోయాడు. ఇలా వేర్వేరు ఫార్మాట్లలో భిన్నంగా రాణిస్తున్న పంత్ ఆటపై తాజాగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టెస్టుల్లో యథావిధిగా పంత్ స్థానాన్ని కొనసాగిస్తూనే..…
దక్షిణాఫ్రితో టీ20 సిరీస్లో భారత జట్టుకు రిషభ్ పంత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే! అయితే, అతడు సమర్థవంతంగా జట్టుని నడిపించలేకపోయాడని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా.. మొదట్లో రెండు మ్యాచ్లు ఘోరంగా ఓడిపోవడంతో, అతడి కెప్టెన్సీని అందరూ తప్పుపట్టారు. ఎలాంటి నాయకత్వ లక్షణాలు అతనిలో లేవని, రిషభ్ స్థానంలో ఓ సీనియర్ ఆటగాడ్ని కెప్టెన్గా ఎంపిక చేయాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తొలి రెండు ఓటముల తర్వాత భారత్ రెండు మ్యాచ్లు కైవసం చేసుకున్నా.. అందులో రిషభ్…
భారత్, దక్షిణాఫ్రికా మధ్య స్వదేశంలో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ నాలుగు మ్యాచ్లు ముగియగా.. చెరో రెండు విజయాలతో ఇరు జట్లు సిరీస్ని సమం చేశారు. ఇప్పుడు ఐదో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఇరు జట్లకి ఇది తాడోపేడో మ్యాచ్! ఎవరు గెలుస్తారో, వారికే సిరీస్ దక్కుతుంది. మొదట్లో భారత్ రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో, దక్షిణాఫ్రికా సునాయాసంగా ఈ సిరీస్ని కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. తొలి మ్యాచ్లో భారీ టార్గెట్ని…
కోహ్లి, రోహిత్, రాహుల్, బుమ్రా, షమి లాంటి సీనియర్ల గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన తర్వాత.. తిరిగి పుంజుకున్న టీమ్ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ఆడేందుకు రెడీ అయింది. ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతో బరిలోకి దిగి.. తొలి రెండు మ్యాచ్ల్లో ఎదురు దెబ్బల తర్వాత గొప్పగా పుంజుకుని సిరీస్ను సమం చేసిన టీమ్ఇండియా.. అదే ఊపును కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు సమిష్టిగా సత్తాచాటి కప్పు కొట్టేయాలని…
ఐపీఎల్లో సత్తాచాటి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న ఆటగాడు అవేశ్ ఖాన్. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్ఇండియా పేసర్ అవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేయడంతో దాన్ని వాళ్ల నాన్నకు అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. ఈ సిరీస్లో తొలి మూడు మ్యాచ్ల్లో అంతగా రాణించకపోయినా.. అతడు ఈ మ్యాచ్లో 4/18 మేటి ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్ఇండియా 82 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం…
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ 2–2తో సమం చేసింది. శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 82 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. మొన్న మూడో టీ20 మ్యాచ్ గెలిచిన భారత కుర్రాళ్లు… నేడు నాలుగో టీ20లోనూ దుమ్మురేపేశారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్స్లు)…
ఈరోజు రాజ్కోట్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. విశాఖలో జరిగిన గత మ్యాచ్లో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకున్న టీమిండియా ఈ మ్యాచ్లోనూ గెలవాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలిస్తే ఐదు టీ20ల సిరీస్ ఆ జట్టు సొంతం అవుతుంది. ఎందుకంటే ఆ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే ఈ సిరీస్లో టీమిండియాను కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ కలవరపెడుతోంది. వరుసగా మూడు మ్యాచ్లలో 29,…