IND vs SA: కోల్కతాలో బ్లాక్ టికెట్ దందా.. రూ. 2500 టికెట్ ఏకంగా 11 వేలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Police Arrested A Man for selling IND vs SA Black Tickets: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలో గెలిచిన టీమిండియా.. సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. లీగ్ దశలో భారత్ ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో నవంబర్ 5న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పటిష్ట దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది. మెగా టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తుండటంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా నవంబర్ 5న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్ డే కావడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండడంతో ఈ మ్యాచ్కు భారీ హైప్ ఏర్పడింది.
భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ చూడాలని అభిమానులు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మ్యాచ్కు సంబందించిన టికెట్స్ ఆన్లైన్లో ఇప్పటికే అమ్ముడయ్యాయి. దాంతో బ్లాక్ దందా తెరపైకి వచ్చింది. అభిమానుల క్రేజ్ను సొమ్ము చేసుకోవాలని బ్లాక్ బకాసురులు చూస్తున్నారు. మంగళవారం ఓ వ్యక్తి రూ. 2500 టికెట్ను ఏకంగా రూ. 11000 ధరకు అమ్ముతుండగా కోల్కతా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 20 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో అతడి ఇంటిపై కూడా పోలీసులు రైడ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు అంకిత్ అగర్వాల్ అని తెలుస్తోంది.
Also Read
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
- Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
Also Read: Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది. విషయం తెలిసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఒక్కో టికెట్ను ఇంత ఎక్కువకు అమ్ముకోవడం ఏంటి? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న భారత్ నవంబర్ 2న శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి అధికారికంగా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. భారత్ ఫామ్ చూస్తే లంకపై విజయం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
తాజావార్తలు
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!