T20 World Cup 2022: ఈనెల 16 నుంచి టీ20 ప్రపంచకప్ మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి. అయితే అసలు టోర్నీ మాత్రం ఈనెల 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో ఆరంభం అవుతుంది. ఈనెల 23న టోర్నీలోనే హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఆరోజు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్పైనే క్రికెట్ అభిమానుల ఆసక్తి నెలకొంది. ఈ మెగా టోర్నీకే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆసియా కప్ తర్వాత దాయాది దేశాలు…
Team India: సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టైటిల్ కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్న టీమిండియాకు బిగ్షాక్ తప్పేలా కనిపించడంలేదు. మోకాలి గాయంతో ఆసియా కప్కు దూరమైన భారత స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కు సైతం దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మోకాలి సర్జరీ నేపథ్యంలో జడ్డూ ప్రపంచకప్ ఆడకపోవచ్చని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. జడేజా కోలుకోవడానికి ఆరు నెలల సమయం కంటే ఎక్కువ పట్టవచ్చని అభిప్రాయపడింది.…
Asia Cup 2022: ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ జట్లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది ఐసీసీ. ఆదివారం నాడు దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయంలోపు భారత్, పాకిస్థాన్ జట్లు తమ ఓవర్లను పూర్తి చేయలేకపోయాయి. దీంతో రెండు జట్లు జరిమానా బారిన పడ్డాయి. ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ రిఫరీ ముందు తమ తప్పును అంగీకరించారని ఐసీసీ ప్రకటించింది. ఇటీవల…
Jay Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జై షాపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జాతీయ పతాకాన్ని జై షా అవమానించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి గెలిపించడంతో స్టాండ్స్లో ఉన్న అభిమానులు, సెలబ్రెటీలు సంబరాలు చేసుకున్నారు.…
Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో ఆదివారం రాత్రికి హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ప్రతిష్టాత్మక మ్యాచ్ ఆడబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్లో 100వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. దీంతో అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలోనూ వంద మ్యాచ్లు ఆడిన ఏకైక…
Asia Cup 2022: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయంటే చాలు అభిమానుల్లో తెలియని భావోద్వేగం చోటు చేసుకుంటుంది. దీంతో అది ఎలాంటి మ్యాచ్ అయినా చూసేందుకు అభిమానులు ఎగబడతారు. కొన్నేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఆసియాకప్లో ఈనెల 28న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో మైదానంలో యుద్ధం లాంటి వాతావరణాన్ని చూడాలని అభిమానులు…
Asia Cup 2022: ఈనెల 27 నుంచి ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ను ఈనెల 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత దాయాది దేశాలు ఇప్పటివరకు తలపడలేదు. దీంతో ఈ మ్యాచ్పై అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల తేదీని…
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ యొక్క షెడ్యూల్ ను ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ లో మొత్తం ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఇందులో మొదటి మ్యాచ్ 2022 మార్చి 4న న్యూజిలాండ్ , వెస్టిండీస్ ల మధ్య జరుగుతుంది. ఇక ఇందులో టీం ఇండియా తమ మొదటి మ్యాచ్ లోనే పాకిస్థాన్ జట్టుతో మార్చి 6న తలపడుతుంది. కాబట్టి ఈ…
భారత్ కు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్ట్, వన్డే ఫార్మాట్ లలో కంటే టీ20 ఫార్మాట్ లో చాలా బలంగా ఉంటుంది. అది ఈ మధ్యే రుజువైంది కూడా. ఐసీసీ ప్రపంచ కప్ చరిత్రలో మొదటిసారి యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో మన టీం ఇండియా ను పాక్ జట్టు ఓడించింది. అయితే ఇప్పుడు వారు మరో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో టీ20 సిరీస్…
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ చేసిన హఠాత్తు ప్రకటన పై చాలా విషయాలు వచ్చిన విషయం తెలిసిందే. కోహ్లీకి మద్దతుగా చాలా మంది అభిమానులు బీసీసీఐ ని తప్పు బట్టారు. ఇప్పుడు అందులో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా చేరాడు. తాజాగా ఈ విషయం పై స్పందించిన కనేరియా… నేను కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం పై మాట్లాడటం లేదు. కానీ తప్పించిన విధానం కరెక్ట్ కాదు అని అన్నారు.…